Balakrishna satires on ap cm ys jagan
Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం వీరసింహారెడ్డి. ఈ మూవీ జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో బాలకృష్ణ కెరియర్ లో 107వ సినిమాగా వీరసింహారెడ్డి చాలా రిచ్గా రూపొందింది. శృతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్ వంటి వారు కీలక పాత్రలలో నటించారు. ఇటీవల చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలులో గ్రాండ్గా జరిగింది. ఈ ఈవెంట్ విషయంలో ఏపీ ప్రభుత్వంతో కొంత రభస జరిగినట్టు తెలుస్తుంది.
ప్రీ రిలీజ్ ఈవెంట్కి ప్రభుత్వం పర్మీషన్ ఇవ్వలేదని వెంటనే ఒక్క రోజు గ్యాప్తో నే వేరు ఏరియాలో ఈవెంట్ నిర్వహించాల్సి వచ్చిందని అంటున్నారు. ఈవెంట్లో బాలయ్య మాట్లాడుతూ.. నిర్మాతలకు సినిమా అంటే ప్యాషన్. ఆ ప్యాషన్ తో ఈ సినిమా చేశారని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా శ్రేయాస్ మీడియాని మెచ్చుకున్నాడు. ఇంత తక్కువ టైమ్ లో ముందు అనుకున్న గ్రౌండ్స్ సరిపోదని చాలా మంది వస్తున్నారని పోలీసులు చెప్పడంతో వేదికని ఇక్కడకు మార్చడం జరిగింది. 24 గంటల వ్యవధిలో ఇంత అద్భుతమైన స్టేజ్ ని శ్రేయాస్ శ్రీనివాస్ టీమ్ కి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాని అన్నారు.
Balakrishna satires on ap cm ys jagan
ఇదే ఈవెంట్లో బాలకృష్ణ మూవీ ట్రైలర్ విడుదల కాగా, ఇందులో ఆశించినవన్నీ ఉన్నాయని నందమూరి అభిమానులు, బాలయ్య ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు .అయితే ఈ ట్రైలర్ రిలీజ్ అయిన కొద్దిసేపటికే బాలకృష్ణ చెప్పిన డైలాగ్ పొలిటికల్ సర్కిల్స్లోనూ హాట్ టాపిక్గా మారింది. ‘సంతకాలు పెడితే బోర్డు మీ పేరు మారుతుందేమో కానీ.. ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు’ అనే డైలాగ్తో ఈ ట్రైలర్ ముగించారు. ఏపీలోని అధికార వైసీపీ ప్రభుత్వానికి కౌంటర్గానే బాలకృష్ణ ఈ డైలాగ్ చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది. చిరంజీవి చేయలేకపోయిన పనిని బాలయ్య తన సినిమా ద్వారా చేసి చూపించాడు అని ఆయన అభిమానులు చెప్పుకొస్తున్నారు.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.