Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం వీరసింహారెడ్డి. ఈ మూవీ జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో బాలకృష్ణ కెరియర్ లో 107వ సినిమాగా వీరసింహారెడ్డి చాలా రిచ్గా రూపొందింది. శృతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్ వంటి వారు కీలక పాత్రలలో నటించారు. ఇటీవల చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలులో గ్రాండ్గా జరిగింది. ఈ ఈవెంట్ విషయంలో ఏపీ ప్రభుత్వంతో కొంత రభస జరిగినట్టు తెలుస్తుంది.
ప్రీ రిలీజ్ ఈవెంట్కి ప్రభుత్వం పర్మీషన్ ఇవ్వలేదని వెంటనే ఒక్క రోజు గ్యాప్తో నే వేరు ఏరియాలో ఈవెంట్ నిర్వహించాల్సి వచ్చిందని అంటున్నారు. ఈవెంట్లో బాలయ్య మాట్లాడుతూ.. నిర్మాతలకు సినిమా అంటే ప్యాషన్. ఆ ప్యాషన్ తో ఈ సినిమా చేశారని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా శ్రేయాస్ మీడియాని మెచ్చుకున్నాడు. ఇంత తక్కువ టైమ్ లో ముందు అనుకున్న గ్రౌండ్స్ సరిపోదని చాలా మంది వస్తున్నారని పోలీసులు చెప్పడంతో వేదికని ఇక్కడకు మార్చడం జరిగింది. 24 గంటల వ్యవధిలో ఇంత అద్భుతమైన స్టేజ్ ని శ్రేయాస్ శ్రీనివాస్ టీమ్ కి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాని అన్నారు.
ఇదే ఈవెంట్లో బాలకృష్ణ మూవీ ట్రైలర్ విడుదల కాగా, ఇందులో ఆశించినవన్నీ ఉన్నాయని నందమూరి అభిమానులు, బాలయ్య ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు .అయితే ఈ ట్రైలర్ రిలీజ్ అయిన కొద్దిసేపటికే బాలకృష్ణ చెప్పిన డైలాగ్ పొలిటికల్ సర్కిల్స్లోనూ హాట్ టాపిక్గా మారింది. ‘సంతకాలు పెడితే బోర్డు మీ పేరు మారుతుందేమో కానీ.. ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు’ అనే డైలాగ్తో ఈ ట్రైలర్ ముగించారు. ఏపీలోని అధికార వైసీపీ ప్రభుత్వానికి కౌంటర్గానే బాలకృష్ణ ఈ డైలాగ్ చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది. చిరంజీవి చేయలేకపోయిన పనిని బాలయ్య తన సినిమా ద్వారా చేసి చూపించాడు అని ఆయన అభిమానులు చెప్పుకొస్తున్నారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.