
Chiranjeevi learns about Upendra Waiting
Chiranjeevi : టాలీవుడ్ చిత్ర సీమకు దర్శకరత్న దాసరి నారాయణరావు పెద్ద దిక్కుగా ఉండేవారు. కాగా, ఆయన మరణానంతరం ఇండస్ట్రీ పెద్దగా ఎవరు ఉండాలనే చర్చ చాలా కాలం నుంచి ఉంది. మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అని చాలా మంది ఈ సందర్భంగా అన్నారు. కరోనా సమయంలో ట్రస్ట్ ద్వారా తన వంతు విరాళం ఇవ్వడంతో పాటు మరి కొంత మంది హీరోల సహాయ సహకారాలతో చిరంజీవి పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే చిరునే.. నెక్స్ట్ ఇండస్ట్రీ పెద్ద అని పలువురు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. కాగా, పలువురు ఈ విషయమై అభ్యంతరం వ్యక్తం చేశారు.ఇండస్ట్రీ పెద్ద ఎవరు అనే విషయమై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్
(మా) ఎన్నికల సమయంలోనూ చర్చ జరిగింది. ఎన్నికలలో సీనియర్ హీరో మోహన్ బాబు తనయుడు విష్ణు విజయం సాధించాడు. ఈ క్రమంలోనే మోహన్ బాబు సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అన్నట్లు సీనియర్ హీరో నరేశ్, పలువురు పేర్కొన్నట్లు వార్తలొచ్చాయి. కాగా, తాజాగా ఇండస్ట్రీ పెద్దరికంపై మెగాస్టార్ చిరు పెదవి విప్పారు. ఇటీవల ‘యోధా డయాగ్నస్టిక్స్’ ప్రారంభోత్సవంలో సినీ ఇండస్ట్రీలోని అన్నీ విభాగాల వారికి రాయితీ ఇవ్వాలని కోరాడు. ఈ క్రమంలోనే డయాగ్నస్టిక్స్ వారు యాభై శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించారు. అందుకు సంబంధించిన హెల్త్ కార్డులను తాజాగా చిరంజీవి సమక్షంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్లో ఇచ్చారు.
chiranjeevi commeents on tollywood film industry which got viral
ఈ సందర్భంగా చిరంజీవి తాను సినీ పరిశ్రమకు పెద్దగా వ్యవహరించడం గురించి మాట్లాడారు.తాను టాలీవుడ్ చిత్రసీమకు పెద్దగా ఉండనని, బాధ్యత గల ఒక బిడ్డగా ఉంటానని చెప్పాడు. అవసరం వచ్చినప్పుడు నేనున్నాంటూ ముందుకు వస్తానని, అయితే, అనవసరమైన విషయాలపై తగుదునమ్మా అని ముందుకొచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సినీ ఇండస్ట్రీ పెద్దరికం అనేది తనకొద్దని, ఏ సమయంలోనైనా అవసరం వచ్చినప్పుడు బాధ్యత తీసుకోవడానికి తాను ఎప్పుడూ రెడీగా ఉంటానని పేర్కొన్నాడు. ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడం తనకు చాలా పెద్ద ఇబ్బందని చెప్పుకొచ్చాడు మెగాస్టార్. చిరంజీవి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
Business : ప్రపంచంలో ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నప్పటికీ కొంతమంది ఎంచుకునే మార్గాలు సాధారణ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ వినియోగించే WhatsApp ఇప్పుడు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటివరకు పూర్తిగా…
Gold : ఇటీవలి కాలంలో డిజిటల్ గోల్డ్కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. స్మార్ట్ఫోన్ యాప్స్ అందుబాటులోకి రావడంతో బంగారాన్ని కొనుగోలు…
Mangoes : వేసవి కాలం అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది మామిడి పండు. సహజంగా తీపి రుచితో ఆకట్టుకునే ఈ…
Tea : ఉదయం నిద్రలేవగానే వేడి వేడి టీ కప్పు లేకపోతే చాలా మందికి రోజు మొదలవదనే చెప్పాలి. టీ…
Millet Breakfast : ఉదయం లేవగానే కొందరికి అలసట, నీరసం అనిపించడం సాధారణ విషయం. రాత్రి నిద్ర బాగా పడినా…
BPCL : ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి శుభవార్త అందింది. ప్రముఖ పబ్లిక్…
Aadhaar Card : భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ…
PM Modi : ఎన్నికల రాజకీయాల్లో అనుభవం కలిగిన ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన ప్రత్యేక శైలిని ప్రదర్శించారు.…
Samantha : అక్కినేని వారసుడు నాగచైతన్య, అగ్రనటి సమంత రూత్ ప్రభు ప్రేమకథ టాలీవుడ్లో ఒకప్పుడు హాట్ టాపిక్గా నిలిచింది.…
Airtel : టెలికాం రంగంలో మరోసారి ధరల పెంపు చర్చకు దారి తీసింది. ప్రముఖ టెలికాం సంస్థ Airtel తన…
CM Chandrababu : తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని పలు కీలక…
This website uses cookies.