Prabhas : ప్ర‌భాస్ మ‌మ్మ‌ల్ని చెడ‌గొడుతున్నాడ‌న్న దిశా పటాని | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Prabhas : ప్ర‌భాస్ మ‌మ్మ‌ల్ని చెడ‌గొడుతున్నాడ‌న్న దిశా పటాని

Prabhas : వ‌రుణ్ తేజ్ హీరోగా రూపొందిన లోఫ‌ర్ సినిమాలో క‌థానాయిక‌గా న‌టించిన అందాల ముద్దుగుమ్మ దిశా ప‌టాని. నటిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన దిశా పటాని ఒక్క చిత్రంతోనే ఆమె ప్రయాణం ఆగిపోయింది. ఆమె నటన కంటే ఎక్కువగా గ్లామర్, ఎఫైర్ వ్యవహారాలతోనే గుర్తింపు సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో తక్కువ టైంలోనే దిశా పటాని బాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే […]

 Authored By sandeep | The Telugu News | Updated on :10 May 2022,6:31 pm

Prabhas : వ‌రుణ్ తేజ్ హీరోగా రూపొందిన లోఫ‌ర్ సినిమాలో క‌థానాయిక‌గా న‌టించిన అందాల ముద్దుగుమ్మ దిశా ప‌టాని. నటిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన దిశా పటాని ఒక్క చిత్రంతోనే ఆమె ప్రయాణం ఆగిపోయింది. ఆమె నటన కంటే ఎక్కువగా గ్లామర్, ఎఫైర్ వ్యవహారాలతోనే గుర్తింపు సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో తక్కువ టైంలోనే దిశా పటాని బాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు. దిశా పటాని వెండి తెరపైకూడా హీటెక్కించే నటి. ఈ అమ్మ‌డు ప్రస్తుతం ప్రభాస్ చిత్రంలో నటిస్తోంది.

ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ఇలా స్టార్ క్యాస్టింగ్‌తో నాగ్ అశ్విన్ చేస్తోన్న ప్రాజెక్ట్ కే చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన‌ అప్డేట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమ సెట్‌లొ ఇప్పుడు దిశా పటాని ఎంట్రీ ఇచ్చింది. ఇక దిశా పటాని తనకు ప్రభాస్ పంపించిన లంచ్ ఐటంలను చూసి ఆశ్చర్యపోయినట్టుంది. ఇలా ఫుడ్ పెట్టి మమ్మల్ని చెడగొడుతున్నందుకు థ్యాంక్స్ అని కామెంట్ పెట్టేసింది. ప్ర‌భాస్ లంచ్ మెనూ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

Disha Patani tweet on prabhas

Disha Patani tweet on prabhas

Prabhas : దిశాని చంపేస్తున్నాడ‌ట‌…

అంత ఫుడ్‌ని పంపించ‌నందుకు దిశా ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. గ‌తంలో ప్రభాస్.. చాలా మంది హీరోయిన్స్‌కి కూడా ఇలా ఫుడ్ పంపించాడు.కాగా, రాధే శ్యామ్ డిజాస్టర్ తరువాత ప్రభాస్ కాస్త విశ్రాంతి తీసుకున్నాడు. విదేశాల్లో ప్రభాస్ కాస్త విరామం తీసుకున్న అనంతరం ఇటీవలె హైద్రాబాద్‌కు చేరుకున్నాడు. ఇక వెంటనే ప్రాజెక్ట్ కే షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఈ షెడ్యూల్ పూర్తయిన తరువాత మళ్లీ కాస్త రెస్ట్ తీసుకుని.. సలార్ షూటింగ్‌లో ప్రభాస్ జాయిన్ అవుతాడని తెలుస్తోంది. దిశా పటాని ప్రస్తుతం ఏక్ విలన్ 2లో నటిస్తోంది. ఈ చిత్రంలో దిశాతో పాటు అర్జున్ కపూర్, జాన్ అబ్రహం, తారా సుతారియా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది