Home » Entertainment » Gmb Enternaiments Started By Mahesh And Namratha Is Due To This
Entertainment

జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ని మహేష్ – నమ్రత అందుకే మొదలు పెట్టారా ..?

Authored By
vamana sai
The Telugu News | Published on: December 20, 2020, 10:34 am
Advertisement

జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ .. సూపర్ స్టార్ మహేష్ బాబు సొంత నిర్మాణ సంస్థ. అంతేకాదు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ మీద మల్టీప్లెక్స్ కూడా స్థాపించాడు. ఇలా జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ని మహేష్ ఆయన సతీమణి నమ్రత కలిసి ప్రారంభించడం వెనక పెద్ద ప్లానే ఉందని చెప్పుకుంటున్నారు. మహేష్ బాబు ఏం చేసినా బయటకి కనిపించకుండా చేస్తున్నాడు. ఒకరికి సహాయం చేసినా అది రెండవ చేతికి తెలీకుండా చేస్తున్నాడు. మహేష్ బాబు లో ఉన్న ఈ గొప్ప గుణం తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నుంచే వచ్చిందని అందరూ అంటున్నారట.

Advertisement

కాగా మహేష్ నమ్రత కలిసి స్థాపించిన జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ మీద వరసగా సినిమాలు తీయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఇందుకు కారణం సినిమా ఇండస్ట్రీ మీద నమ్మకం పెట్టుకున్న యంగ్ టాలెంట్ కి సరైన ప్లాట్ ఫాం దొరకక కెరీర్ ఇబ్బందుల్లో పడుతోంది. ఇలాంటి వాళ్ళకి అండగా నిలవడానికే మహేష్ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ని స్థాపించాడని ఇప్పుడు ఇండస్ట్రీలో అలాగే ఫ్యాన్స్ ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ బ్యానర్ లో యంగ్ హీరోలతో పాటు యంగ్ డైరెక్టర్స్ కి అవకాశాలివ్వబోతున్నారట.

Advertisement

 

Advertisement

ఇప్పటికే అడివి శేష్ హీరోగా మేజర్ అన్న సినిమాని నిర్మిస్తున్నారు మహేష్ – నమ్రత. ఇప్పటికే ఈ సినిమా మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్ గా మేజర్ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి ప్రేక్షకుల నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. కాగా ఇప్పటికే ఏజెంట్ ఆత్రేయ సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి హీరోగా మరో సినిమాని నిర్మిస్తున్నారు మహేష్ నమ్రత. ఈ సినిమా పోస్టర్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. అంతేకాదు త్వరలో సత్యదేవ్, సిద్ధు జొన్నలగడ్డ, రాజ్ తరుణ్ లతోనూ కొత్త ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేయబోతున్నారట. మొత్తానికి మహేష్ – నమ్రత ఇండస్ట్రీ నుంచి తీసుకున్నది మళ్ళీ ఇండస్ట్రీకే ఇచ్చేస్తున్నారని ప్రముఖులందరు ప్రశంసిస్తున్నారు.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి