Tollywood This situation with leading construction companies
Inside Talk : ఒక వైపు తెలుగు సినిమా పరిశ్రమ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. సక్సెస్ రేటు కనీసం 10 శాతం కూడా లేదు. ఏడాదిలో వందలాది సినిమాలు విడుదల అయితే అందులో కనీసం అయిదు పది కూడా సక్సెస్ ను దక్కించుకోవడం లేదు. ఇలాంటి సమయంలో సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు సమస్యల పరిష్కారంకు ప్రయత్నించాలి. సినిమా ఇండస్ట్రీ ప్రతి ఏడాది కోట్లాది రూపాయలను నష్టపోతున్న ఈ సమయంలో అనూహ్యంగా ఏపీలో టికెట్ల రేట్లను తగ్గించడం తో ఆ నష్టం మరింతగా ఎక్కువ అయ్యింది. తెలుగు సినిమాల వసూళ్లలో మెజార్టీ వసూళ్లు ఏపీ నుండి వస్తాయి అనడంలో సందేహం లేదు. అందుకే అక్కడ టికెట్ల రేట్ల ను పెంచాల్సిందే అంటూ విజ్ఞప్తి వ్యక్తం చేస్తుననారు.
ఈ విషయమై స్పందించేందుకు కొందరు భయపడుతూ ఉంటే మరి కొందరు మాత్రం ప్రభుత్వంకు అనుకూలంగా ఉంటూనే సాధ్యం అయితే పెంచాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సమయంలో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా పెద్దరికం తీసుకుని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్దకు వెళ్లారు. అక్కడ టికెట్ల రేట్ల విషయమై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు ప్రయత్నించారు. ఏపీ ప్రజలకు వినోదాన్ని తక్కువ రేటుకు అందించేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే.. కాని ఈ సమయంలో తెలుగు సినిమా కూడా బతకాలి కదా అన్నట్లుగా చిరంజీవి ప్రభుత్వం వద్ద విజ్ఞప్తి ఉంచినట్లుగా తెలుస్తోంది. ఈ సమయంలో చిరంజీవిని ఇండస్ట్రీలో కొందరు విమర్శించడం చర్చనీయాంశంగా మారింది.
Inside Talk industry Talks
టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు కొందరు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చిరంజీవి కలవడం పట్ల విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. సినిమా సమస్యలను అడ్డు పెట్టుకుని చిరంజీవ రాజకీయంగా మళ్లీ తన ప్రస్థానంను మొదలు పెట్టాలని అనుకుంటున్నాడు అంటూ విమర్శలు చేస్తున్న వారు ఎక్కువ అయ్యారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని రాజ్యసభ సీటు అడిగినట్లుగా కూడా వారు కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంలో చిరంజీవి ఇప్పటికే తనకు రాజకీయం చేసే ఉద్దేశ్యం లేదని క్లారిటీ ఇచ్చినా కూడా అస్సలు చిరంజీవిని వదలడం లేదు. చిరంజీవి రాజకీయ ఉద్దేశ్యం లేదని చెప్పినా కూడా అర్థం పర్థం లేని విమర్శలు చేస్తూ అడ్డగాడిదల మాదిరిగా విమర్శలు చేస్తున్నారంటూ చిరంజీవి అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
This website uses cookies.