Aacharya : చిరంజీవి క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నారా ..?

Authored By vamana sai | The Telugu News | Updated on: January 21, 2021, 4:21 pm

Aacharya , చిరంజీవి లైనప్ చేసిన సినిమాలలో ప్రస్తుతం ఆచార్య సెట్స్ మీద ఉంది. త్వరలో ఆచార్య సినిమాని కంప్లీట్ చేయనున్నారు. రాం చరణ్ – నిరంజన్ రెడ్డి నిర్మాతలుగా నిర్మిస్తున్న ఆచార్య సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. రాం చరణ్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమా సమ్మర్ కి రిలీజ్ కాబోతోంది. ఇక ఈ నెల 26 న ఆచార్య సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ టీజర్ కి మణిశర్మ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నట్టు సమాచారం.

ఈ క్రమంలో చిరంజీవి నెక్స్ట్ సినిమాని సెట్స్ మీదకి తీసుకురాబోతున్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూజా కార్యక్రమాలను కూడా ఘనంగా నిర్వహించారు. ఫిబ్రవరి నెల నుంచి సెట్స్ మీదకి వెళ్ళబోతోంది. ప్రస్తుతం ఈ సినిమాలోని ప్రధాన తారాగణం ఎంపిక జరుగుతోందట. త్వరలో హీరోయిన్ సహా ఇతర పాత్రలకి సంబంధించిన నటులను ప్రకటించబోతున్నారని సమాచారం. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ఎంపికయ్యాడు. ఫస్ట్ టైం థమన్ .. చిరంజీవి సినిమాకి సంగీతం అందిస్తుండటం తో అద్భుతమైన ట్యూన్స్ రెడీ చేస్తున్నాడని తెలుస్తోంది.

కాగా చిరంజీవి లైనప్ చేసిన క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఒక ప్రాజెక్ట్ నుంచి డ్రాపయ్యే అవకాశాలున్నాయని న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ప్రాజెక్ట్ తమిళంలో అజిత్ కుమార్ నటించగా సూపర్ హిట్ గా నిలిచిన వేదాలం తెలుగు రీమేక్. ఈపాటికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ కూడా సిద్దం అయిందని మెహర్ రమేష్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడని వార్తలు వచ్చాయి. సమ్మర్ తర్వాత ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకు వెళ్ళేలా సన్నాహాలు జరుగుతున్నాయని అన్నారు. అంతేకాదు ఈ సినిమా విషయంలో చిరంజీవి కూడా స్వయంగా వెల్లడించారు. మరి ఇప్పుడు ఈ న్యూస్ ఎందుకు వచ్చిందన్నది మేకర్స్ క్లారిటీ ఇస్తేనే నమ్మడానికి లేదు.

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp