Janaki Kalaganaledu 4 Oct Today Episode : బొమ్మల కొలువు కోసం జ్ఞానాంబను ఒప్పించిన జానకి.. మల్లిక ప్లాన్ వేసి ఆపిస్తుందా? ఇంట్లో అరిష్టం వచ్చేలా చేస్తుందా?

Authored By Varun G | The Telugu News | Updated on : 4 October 2022, 9:30 am

Janaki Kalaganaledu 4 Oct Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 4 అక్టోబర్ 2022, మంగళవారం ఎపిసోడ్ 402 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి పరీక్ష బాగా రాయడంతో రామా చాలా ఆనందంగా ఉంటాడు. వెంటనే ఇంటికి వచ్చి అందరినీ పిలుస్తాడు. జ్ఞానాంబ కూడా వస్తుంది. దీంతో జానకి గారు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు.. అని అందరికీ చెబుతాడు. దీంతో అందరూ సంతోషిస్తారు. జ్ఞానాంబ కూడా సంతోషిస్తుంది. తన చదువును నిర్లక్ష్యం చేయకుండా తన ఆశయ సాధన వైపు అడుగులు వేసింది అని అంటుంది జ్ఞానాంబ. కొంత మంది ఉంటారు. పరమాన్నం వండి పెట్టినా కానీ అందులో స్వయంగా విషం కలుపుకుంటారు అని జెస్సీని ఉద్దేశించి అంటుంది జ్ఞానాంబ.

janaki kalaganaledu 4 october 2022 full episode

janaki kalaganaledu 4 october 2022 full episode

ఎన్ని సమకూర్చిన బాధ్యతలను విస్మరించి ఆడపిల్లల భవిష్యత్తు పాడు చేయాలని చూస్తారని అఖిల్ ను ఉద్దేశించి అంటుంది జ్ఞానాంబ. జానకి తులసి వనం లాంటిదైతే.. వాళ్లు కలుపుమొక్క అంటుంది జ్ఞానాంబ. దీంతో కోపంతో అఖిల్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. జానకి ఇక నుంచి ఎలాంటి సమస్యలను తలకెత్తుకోకుండా నీ చదువు మీదనే దృష్టి పెట్టు అంటుంది జ్ఞానాంబ. దీంతో సరే అత్తయ్య గారు అంటుంది జానకి. మరోవైపు జెస్సీ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మల్లికకు చాలా కోపం వస్తుంది. జానకి ఐపీఎస్ ఎలా అవుతుందో నేను చూస్తాను అని మనసులో అనుకుంటుంది మల్లిక.

మరోవైపు అఖిల్ కోపంతో బయటికి వెళ్లి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంట్లో ఏ మంచి విషయం జరిగినా దాన్ని అడ్డుపెట్టుకొని అమ్మ నాకు క్లాస్ పీకుతూనే ఉంది. ఇదంతా ఆ జెస్సీ వల్లే.. చా అని అనుకుంటాడు అఖిల్. ఏం చేయాలి అని అనుకుంటాడు. మరోవైపు అఖిల్ ను వెతుక్కుంటూ జెస్సీ తన దగ్గరికి వస్తుంది.

Janaki Kalaganaledu 4 Oct Today Episode : జెస్సీపై మండిపడ్డ అఖిల్

అత్తయ్య గారి గురించి నాకంటే నీకే బాగా తెలుసు కదా. తప్పు చేస్తే, కోపం వస్తే ముక్కుసూటిగా మాట అంటారు కానీ.. చిన్న మంచి పని చేసినా నెత్తి మీద పెట్టుకుంటారని తెలుసు కదా. ఎప్పటిలాగే అత్తయ్య గారు నిన్ను దగ్గరికి తీసుకుంటారు అభి అని అంటుంది జెస్సీ.

నా మనసుకు తీరని గాయం చేసి ఇప్పుడు మాటలతో వెన్న పూస్తున్నావా అని అంటాడు. నన్ను మా అమ్మ అన్ని మాటలు అనడానికి కారణం నువ్వే కదా అంటాడు అఖిల్. నేనా అంటుంది జెస్సీ. నేనేం చేశా అంటుంది జెస్సీ.

దీంతో చేసిందంతా చేసి ఇప్పుడు ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావా అంటాడు అఖిల్. నా పరిస్థితి ఎంత దరిద్రంగా ఉందో చూడు. అయిన దానికి కాని దానికి మా అమ్మ నన్ను తిడుతోంది. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు అఖిల్.

మరోవైపు రాత్రి అయినా పడుకోకుండా రామా ఏదో లెక్కలు వేయడం చూస్తుంది జానకి. ఏంటి అని అడుగుతుంది. దీంతో మీకు పరీక్షల కోసం ఇబ్బంది లేకుండా ఎలా రాసుకోవాలా అని అన్నీ చూసుకుంటున్నాను అని అంటాడు.

తర్వాత జ్ఞానాంబతో మాట్లాడిన జానకి, మీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను అంటుంది జానకి. మామూలుగా అయితే మనం బొమ్మల కొలువు పెట్టకపోయినా ఇబ్బంది ఏం లేదు కానీ.. ఇప్పుడు మన ఇంట్లో ఇద్దరు కడుపుతో ఉన్నారు అంటుంది జానకి.

ఒక్కరికి ఇద్దరు వారసులు రాబోతున్నారు. వాళ్ల ఆరోగ్యం, ఆయుష్షు కోసం అయినా మనం బొమ్మల కొలువు పెట్టాలి. అమ్మ వారి ఆశీస్సులు ఉండాలంటే మనం ఈ వేడుక చేయాలి అత్తయ్య గారు అంటుంది జానకి.

మొన్నటిలా ఎలాంటి అవమానాలు లేకుండా చూసుకునే బాధ్యత నాది. దయచేసి కాదనకండి అత్తయ్య గారు అంటుంది జానకి. దీంతో సరే అని అంటుంది జ్ఞానాంబ. చిన్నపిల్లలను పిలిచి బొమ్మల కొలువు చేస్తావా. మిగిలిన విషయాలు నేను చూసుకుంటానుగా అని మల్లిక అనుకుంటుంది.

ఒకవేళ జానకి బొమ్మల కొలువు నిర్వహిస్తే పోలేరమ్మ మళ్లీ ఆకాశానికి ఎత్తేస్తుంది. నా విలువ ఇంకా దిగజారి పోతుంది. దీన్ని ఎలా చెడగొట్టాలి అని అనుకుంటుంది మల్లిక. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి