Mahesh Babu Jr Ntr : సాధారణంగా ఒకే వేదికపై ఇద్దరు అగ్రహీరోలు కనిపిస్తే ఇంకా ఏమైనా ఉన్నదా..? చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. ఇక ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటారు. తమ అభిమాన హీరోల కోసం వచ్చిన మరో అగ్రహీరోను సైతం చూసి విజిల్స్తో తెగ సందడి చేస్తుంటారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలాంటి అరుదైన ఘటనలు ఎప్పుడో ఒకసారి మాత్రమే చోటుచేసుకుంటాయి. తాజాగా ఇటువంటి అద్బుత సన్నివేశం త్వరలోనే ప్రేక్షకులు చూడనున్నారు. నందమూరి నటసింహం బాలకృష్ణ కోసం యంగ్ టైగర్ ఎన్టీయార్, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకే వేదిక పై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. అదే ‘అఖండ’ సక్సెస్ మీట్..
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తెరెకెక్కిన ‘అఖండ’ మూవీ భారీ విజయన్ని సొంతం చేసుకుంది. తొలి రోజే హిట్ టాక్ తెచ్చుకోవడంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్లు ఖుషీలో ఉన్నారు. అఖండ సినిమా కలెకన్ల పరంగా కూడా దూసుకుపోతుంది. వీకెండ్ కూడా రావడంతో వసూళ్లు భారీగానే ఉంటాయని నిర్మాతలు భావిస్తున్నారు. సమీపంలో మరో సినిమా విడుదలకు రెడీగా లేకపోవడంతో మరో వారం పాటు అఖండ మంచి కలెక్షన్లతో దూసుకుపోతుందని మూవీ మేకర్స్ భావిస్తున్నారు. కరోనా కష్టకాలం తర్వాత విడుదలైన అగ్ర హీరో ఈ రేంజ్లో విజయాన్ని సొంతం చేసుకోవడంతో చిత్ర పరిశ్రమలోని పెద్ద హీరోలు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ సినిమాలకు కూడా జనాలు వస్తారని, కొవిడ్ భయం పెద్ద ఆటంకం ఏమీ కాదనే ధీమాలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇకపోతే బోయపాటి శ్రీను బాలయ్య బాబు కాంబినేషన్ హ్యాట్రిక్ కొట్టగా.. ఈ నెల 8న సక్సెస్ మీట్ నిర్వహించాలని మూవీ యూనిట్ భావిస్తోందట.. ఈ ఫంక్షన్కు యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేశ్ బాబు రానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మూవీ మేకర్స్ అగ్ర హీరోలకు ఇన్విటేషన్ వెళ్లగా ఈ సక్సెస్ మీట్ పై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. చాలా కాలం తర్వాత బాలయ్య బాబు అఖండ తో భారీ హిట్ అందుకోవడంతో బాబాయ్ కోసం అబ్బాయ్.. అభిమాన హీరో కోసం మహేశ్ బాబు వస్తారని అభిమానులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.