Kalyan Ram : నందమూరి నటవారసుడు, హరికృష్ణ తనయుడు కళ్యాణ్ రామ్ తన బాబాయ్ బాలకృష్ణపై సంచలన కామెంట్స్ చేశారు. బాబాయ్ వల్లే తను చిన్నతనంలో చదువుకోలేకపోయానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.అంతలా ఏం జరిగింది. ఎన్నడూ లేనిది కళ్యాణ్ రామ్ బాలయ్య బాబుపై ఇలాంటి కామెంట్స్ చేయడం ఎంటని అంతా షాక్ అవుతున్నారు.అసలు ఏం జరిగిందో కళ్యాణ్ రామ్ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. కళ్యాణ్ రామ్ రీసెంట్గా బింబిసార మూవీతో బంపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. పటాస్ హిట్ అనంతరం చాలా కాలం తర్వాత మళ్లీ కళ్యాణ్ రామ్ ఖాతాలో బ్లాక్ బస్టర్ పడింది.
ఈ సినిమా మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ళ పరంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇది కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అని అంటున్నారు. దీంతో బింబిసార సినిమా మూవీ యూనిట్ మొత్తం సక్సెస్ను సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ క్రమంలోనే మూవీ యూనిట్తో పాటు సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ శ్రీదేవితో స్పెషల్ చిట్ చాట్లో పాల్గొన్నాడు కళ్యాణ్ రామ్. ఈమూవీలో బేబీ శ్రీదేవి శాంభవి అనే పాత్రలో అద్భుతంగా నటించిన విషయం తెలిసిందే.ఈ పాప చుట్టే బింబిసార మూవీ మొత్తం తిరుగుతుంది. తాజాగా శ్రీదేవితో కళ్యాణ్ రామ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ..
తన కెరియర్ కూడా ఇలాగే బాల నటుడిగా ప్రారంభమైందని గుర్తుచేసుకున్నాడు.శ్రీదేవి తన స్టడీస్ గురించి చెప్తుండగా..కళ్యాణ్ రామ్ కూడా తన స్కూల్ డేస్ గురించి చెప్పుకొచ్చాడు.తన బాబాయ్ బాలకృష్ణ తనను బాలనటుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేశాడని ఆయన వల్లే సినిమాల్లోకి వచ్చినట్టు చెప్పాడు. ఆ రోజుల్లో నేను సినిమాల్లో నటించేటప్పుడు కోక్ కావాలి, చాక్లెట్ ఇస్తానే షూటింగ్కు వస్తానని బెదిరించే వాడిని.షూటింగ్ అనంతరం ఇంటికి వెళ్లిపోయేవాడిని.అంతేగాని ఒక్క బుక్కు కూడా చదివే వాడిని కాదు. దాంతో నా స్టడీస్ మొత్తం పోయాయి. మాకు అప్పట్లో 45 వస్తే పాస్. నాకు 46, 47మార్కులు వచ్చేవి.అలా బాబాయ్ తనను సినిమాల్లోకి తీసుకుని రావడంతో నా చదువు మొత్తం పోయిందంటూ కళ్యాణ్ రామ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.