నరకం చూశానంటోంది.. పాపం ఆ సింగర్‌ను ఆడుకున్నారు! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

నరకం చూశానంటోంది.. పాపం ఆ సింగర్‌ను ఆడుకున్నారు!

కరోనా వైరస్ అంటే ఏంటి అనేది అప్పుడప్పుడు భారతీయులు తెలుసుకుంటున్న సమయం అది. ఒకటి రెండు కేసులు మాత్రమే నమోదవుతున్న తరుణంలో బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. కనికా కపూర్ ఎయిర్ పోర్ట్‌లో టెస్టులు చేసుకోకుండా తప్పించుకుని రావడం, ఆ తరువాత రెండు పెద్ద పార్టీల్లో పాల్గొనడం అందులో సినీ రాజకీయ ప్రముఖులు ఉండటం అప్పట్లో ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇక కనికా కపూర్‌కు కరోనా వైరస్ అని […]

 Authored By uday | The Telugu News | Updated on :13 December 2020,2:15 pm

కరోనా వైరస్ అంటే ఏంటి అనేది అప్పుడప్పుడు భారతీయులు తెలుసుకుంటున్న సమయం అది. ఒకటి రెండు కేసులు మాత్రమే నమోదవుతున్న తరుణంలో బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. కనికా కపూర్ ఎయిర్ పోర్ట్‌లో టెస్టులు చేసుకోకుండా తప్పించుకుని రావడం, ఆ తరువాత రెండు పెద్ద పార్టీల్లో పాల్గొనడం అందులో సినీ రాజకీయ ప్రముఖులు ఉండటం అప్పట్లో ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.

Kanika kapoor about Her Bad day In Corona time

Kanika kapoor about Her Bad day In Corona time

ఇక కనికా కపూర్‌కు కరోనా వైరస్ అని తేలడంతో పార్లమెంట్ కూడా దద్దరిల్లింది. ఆ సమయంలో కనికా నిర్లక్ష్యంపై దేశ ప్రజలు మండిపడ్డారు. ఆమెను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఎందుకంటే అప్పుడు కరోనా అంటే అంత భయంతో ఉండేవారు. తాజాగా కనిక కరోనా సమయంలో తాను అనుభవించిన నరకాన్ని బయటకు చెప్పేసింది. నాటి పరిస్థితులను తలుచుకుని ఎమోషనల్ అయింది.

‘నాకు కరోనా వచ్చిన సమయంలో నా కుటుంబం, పిల్లలు ఎంతో బాధాకరమైన సంఘటనలు ఎదుర్కొన్నారు. కొన్ని పరిస్థితుల కారణంగా నా పిల్లల్ని లండన్‌లో వదిలి ఇండియాకు రావాల్సి వచ్చింది. వాళ్లు ప్రతిరోజూ ఫోన్‌ చేసి.. ‘అమ్మ ఎలా ఉన్నావు? మా దగ్గరకి ఎప్పుడు వస్తావు?’ అని అడిగేవాళ్లని చెప్పుకొచ్చింది. నా పిల్లలు, పేరెంట్స్‌కు నెటిజన్లు బెదిరింపులు ఎదురయ్యాయి. చనిపోండంటూ పిచ్చి సలహాలు కూడా ఇచ్చారు. అలాంటి క్షణాల్లోనూ నా కుటుంబం నాకు తోడుగా నిలిచింది. అందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని కనికా కపూర్‌ ఎమోషనల్ యింది.

uday

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది