Mahesh Babu : మహేశ్ బాబు ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ .. సర్కారు వారి పాట విషయం లో సూపర్ న్యూస్ !

Authored By Sam C | The Telugu News | Published on: January 22, 2022, 3:20 pm

Mahesh Babu: స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రం త‌ర్వాత మ‌హేష్ బాబు న‌టిస్తున్న తాజా చిత్రం స‌ర్కారు వారి పాట‌. ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మ‌హ‌ష్ స‌ర‌స‌న కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగుతున్న అతిపెద్ద కుంభకోణం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ల మీద నవీన్ యెర్నేని, వై. రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట, మహేష్ బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ బాణీలు కడుతున్నారు.

ఈ సినిమా రిలీజ్‌కి అనేక స‌మ‌స్య‌లు ఎదురవుతున్నాయి. సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానున్న ఈ చిత్రం ఆర్ఆర్ఆర్ వ‌ల‌న వాయిదా ప‌డి ఏప్రిల్ 1కి షిఫ్ట్ అయింది. ఆ రోజు ఆచార్య వ‌స్తుండ‌డంతో స‌ర్కారు వారి ప‌ట మూవీ మ‌రింత ముందుకు పోనుంద‌ని తెలుస్తుంది. అయితే కొద్ది రోజులుగా మూవీకి సంబంధించి ఎలాంటి స‌మాచారం లేక‌పోవ‌డంతో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ మూవీ ప్రమోషన్స్ గురించి తెలిపారు.ఫిబ్రవరి 14న వరుస సింగిల్స్ విడుదలయ్యేందుకు ఆస్కారం ఉందని ఖరారు చేస్తూ.. అతను సంగీతం ప్రేమ ఎమోజీలను కూడా జోడించాడు.

mahesh babu fans full happy with thaman tweet

mahesh babu fans full happy with thaman tweet

Mahesh Babu : మ‌హేష్ ఫ్యాన్స్‌కి పున‌కాలే..!

సర్కారు వారి పాట నుండి మొదటి పాట విడుదల గురించి అతను సూచించాడని ఊహాగానాలు చేస్తున్నారు. కాగా, దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో…ఈ సినిమా షూటింగ్ నిలిపివేశారు. ఇక ప్రధాన నటులు మహేశ్ బాబు, కీర్తి సురేష్‌లకు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. మహేశ్ బాబుకు నెగెటివ్ వచ్చినప్పటికీ కీర్తి మాత్రం ఐసోలేషన్‌లోనే ఉంది. రీసెంట్‌గా యూకే సెన్సార్ బోర్డు సభ్యుడు, సినీ విశ్లేషకులు ఉమైర్ సంధు ‘సర్కారు వారి పాట’ మూవీపై ఫస్ట్ రివ్యూ ఇచ్చారు. ”తాను ఒక మింట్ రష్ ప్రింట్ చూశానని…సినిమా మైండ్ బ్లోయింగ్” గా ఉందని ఆయన వెల్లడించారు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp