Mahesh Babu : టాలీవుడ్లో మరో క్రేజీ కాంబో.. మహేశ్ బాబు, రామ్ చరణ్ హీరోలుగా మూవీ.. డైరెక్టర్ ఎవరంటే?
Mahesh Babu : టాలీవుడ్లో ప్రజెంట్ మల్టీస్టారర్ మూవీస్ ట్రెండ్ నడుస్తోందని చెప్పొచ్చు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్లో, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా ‘భీమ్లా నాయక్’మూవీలో, సిద్దార్థ్, శర్వానంద్ ‘మహా సముద్రం’ చిత్రంలో నటించారు. త్వరలో మెగాస్టార్ 154 వ చిత్రంలో మాస్ మహారాజ రవితేజ నటించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో క్రేజీ న్యూస్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. ఆ న్యూస్ ప్రకారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఓ మూవీ చేయబోతున్నారని తెలుస్తోంది.
రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ‘ఆర్ఆర్ఆర్’ పిక్చర్ వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కానుంది. ఈ సినిమా ద్వారా తెలుగు సినిమా ఖ్యాతి మరింత పెరుగుతుందని సినీ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే రామ్ చరణ్ తేజ్ తన తండ్రి చిరంజీవితో కలిసి నటించిన ‘ఆచార్య’ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదల కానుంది. ఈ క్రమంలోనే రామ్ చరణ్ తేజ్ మరో మల్టీ స్టారర్ మూవీకి ఓకే చెప్పారని తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం, వార్తల ప్రకారం.. ఈసారి మహేశ్ బాబుతో కలిసి ఓ మూవీ చేసేందుకుగాను చెర్రీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని వినికిడి.

mahesh babu one more crazy multistarrer film in tollywood mahesh babu ram charan doing a movie
Mahesh Babu : ట్రెండ్ సృష్టిస్తున్న టాలీవుడ్ హీరోలు..
సదరు మల్టీస్టారర్ మూవీకి వంశీ పైడిపల్లి డైరెక్టర్ కాగా, అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ అని టాక్.
వంశీ పైడి పల్లి గతంలో చెర్రీ, మహేశ్లతో వర్క్ చేశాడు. ఈ క్రమంలోనే వారిరువురిని వంశీ డీల్ చేయగలడని ప్రొడ్యూసర్ అరవింద్ భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే, ఈ విషయమై అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఇదే విషయం నిజమైతే ఇక అభిమానులకు మరోసారి పండుగ లాంటి సినిమా ఇవ్వబోతున్నారు మహేశ్, రామ్ చరణ్. మహేశ్ ప్రజెంట్ ‘సర్కారు వారి పాట’ ఫిల్మ్ షూట్లో ఉండగా, రామ్ చరణ్ ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో పాన్ ఇండియా ఫిల్మ్ షూట్ ఇటీవల కంప్లీట్ చేశాడు.