Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అభిమానుల ఉత్సాహాన్ని నీరుగారుచుతున్న అల్లు అరవింద్

Authored By aruna | The Telugu News | Published on: August 28, 2022, 7:00 pm

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సమీపిస్తోంది. ఈ సమయంలో ఆయన నటించిన జల్సా మరియు తమ్ముడు సినిమాలను రిలీజ్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. అందుకోసం అభిమాన సంఘం నాయకులు ఆయా సినిమాల యొక్క నిర్మాతలతో చర్చలు జరుపుతున్నారు. గతంలో వచ్చిన సినిమాలను ఇప్పుడు థియేటర్లో విడుదల చేయాలంటే 4కే సౌండ్ సిస్టం యాడ్ చేయడంతో పాటు కొంత టెక్నికల్ గా సినిమాను మార్చాల్సి ఉంటుంది. అందుకు నిర్మాతలు పాతిక నుండి 50 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఇప్పుడు జల్సా సినిమాకు అంత ఖర్చు చేసేందుకు తాము సిద్ధంగా లేము అంటూ అల్లు అరవింద్ చేతులు ఎత్తేసాడంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గతంలో జల్సా సినిమాతో భారీ లాభాలను దక్కించుకున్న అల్లు అరవింద్ ఇప్పుడు ఆ చిన్న మొత్తమును పెట్టేందుకు ముందుకు రాకపోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర సంతృప్తితో ఉన్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున ఈ రెండు సినిమాలను తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలో కూడా స్క్రీనింగ్ చేయాలని భావించారు. కానీ అల్లు అరవింద్ నిర్ణయంతో ఇప్పుడు జల్సా సినిమా యొక్క స్క్రీనింగ్ డైలమాలో పడ్డట్లు అయ్యింది.

mega and Pawan Kalyan fans angry on Allu Aravind due to jalsa movie

mega and Pawan Kalyan fans angry on Allu Aravind due to jalsa movie

హీరో పవన్ కళ్యాణ్, హీరోయిన్ ఇలియానా జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన జల్సా సినిమా అల్లు అరవింద్ కి అప్పట్లో భారీ విజయాన్ని తెచ్చి పెట్టింది. దాదాపుగా పాతిక కోట్ల లాభాన్ని అల్లు అరవింద్ కు ఆ సినిమా తెచ్చి పెట్టింది అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు అల్లు అరవింద్ సినిమాను రిలీస్ చేసేందుకు సిద్ధంగా లేడని, అందుకు కారణం మళ్లీ ఖర్చు పెట్టాల్సి ఉండడమే అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే అల్లు అరవింద్ పై పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు మెగా ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారంటూ సమాచారం అందుతుంది. ఈ విషయంలో అల్లు అరవింద్ ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp