Samantha : శాకుంతలం ట్రైలర్ ఫంక్షన్ లో .. నాగ చైతన్య పేరు ఎత్తారా? అందుకే సమంత ఏడిచిందా..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :10 January 2023,4:20 pm

Samantha : అందాల ముద్దుగుమ్మ స‌మంత న‌టించిన శాకుంత‌లం చిత్రం ఫిబ్ర‌వ‌రి 17న విడుద‌ల కానుండ‌గా, ఈ మూవీకి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. చివ‌రిగా స‌మంత న‌టించిన ‘యశోద’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో తెల్సిందే..ఈ సినిమా తర్వాత ఆమె ‘శాకుంతలం’ అనే భారీ బడ్జెట్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో న‌టించింది…గుణ శేఖర్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా కి సంబంధించిన ట్రైలర్ రీసెంట్‌గా విడుద‌ల కాగా, ఈ ట్రైలర్ కోసం ఒక ప్రత్యేక ఈవెంట్ ని కూడా ఏర్పాటు చేసారు. ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సమంత చాలా ఎమోషనల్ అయ్యారు.

గుణశేఖర్ మాటలకు కన్నీరు పెట్టుకున్నారు. ‘శాకుంతలం’ సినిమాకు నిజమైన హీరో సమంతే అని గుణశేఖర్ అన్నప్పుడు స‌మంత‌ఎమోషనల్ అయ్యారు. అంతేకాదు ఆమె మాట్లాడిన మాట‌లు కూడా చాలా ఎమోష‌న‌ల్‌గానే సాగాయి. స‌మంత మాట‌ల‌కు ప్ర‌తి ఒక్క‌రు ఆశ్చ‌ర్య‌పోయారు అని చెప్పాలి. అయితే మయోసైటిస్ వ్యాధి ఉందని ప్రకటించాక సమంత మీడియా ముందుకు రావడం ఇదే మొదటిసారి. తన గత సినిమా ‘యశోద’ ప్రమోషన్లలో కూడా సమంత పాల్గొనలేకపోయింది. స‌మంత ఎమోష‌న‌ల్ కావ‌డం ప‌ట్ల సోష‌ల్ మీడియాలో చ‌ర్చ న‌డుస్తుంది. కొంద‌రు ఈవెంట్‌లో నాగ చైత‌న్య పేరు ఎత్తారా.. అందుకే ఏడ్చిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత స‌మంత‌

naga chaitanya is the reason for Samantha emotional

naga chaitanya is the reason for Samantha emotional

Samantha : స‌మంత కన్నీటికి కార‌ణం ఇదేనా?

మీడియా ముందుకు రావడం తో సోషల్ మీడియా లో ఉన్న ప్రముఖ పేజెస్ ‘సమంత ఏమిటి ఇలా అయిపోయింది..అందం మొత్తం తగ్గిపోయింది..విడాకులు తీసుకొని నిలదొక్కుకుంటున్న సమయం లో మయోసిటిస్ వ్యాధి రావడంతో చాలా ఇబ్బందుల్లో ప‌డింది. ఆమె మునుపటిలాగ అందం మరియు అభినయం తో అభిమానులను అలరించాలని కోరుకుంటున్నాను’ అంటూ ఫేస్ బుక్ లో ఒక ప్రముఖ పేజ్ వేసిన పోస్ట్ కి సమంత స్పందించింది. నాకు ఎదురైనని సవాళ్లు పగవాడికి కూడా రాకూడదు…నాలాగా నెలల తరబడి హాస్పిటల్ బెడ్ కి పరిమితమై ట్రీట్మెంట్ తీసుకుంటూ బాధ‌లు ప‌డ‌కూడదు…దేవుడు అంద‌రికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను’ అంటూ సమంత చెప్పుకొచ్చింది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి