Nagarjuna : నాగచైతన్య, సమంత విడాకులు .. నాగార్జున ఏమ‌న్నాడంటే..?

Authored By praveen T | The Telugu News | Published on: October 2, 2021, 7:04 pm

Nagarjuna : గత కొద్ది రోజుల నుంచి నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోబోతున్నారన్న వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. నాగచైతన్య, సమంత తాము విడాకులు తీసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కాగా, ఈ విషయమై టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున స్పందించారు.

Nagarjuna  బరువెక్కిన హృదయంతో చెబుతున్న..  నాగార్జున

సామ్-చై విడాకులు విషయం తెలుసుకుని తన హృదయం బరువెక్కిందని తెలిపారు నాగార్జున. సమంత-చైతన్య మధ్య ఏం జరిగిందో అది చాలా దురదృష్టకరమని, భార్యా భర్తల మధ్య జరిగేది వారి వ్యక్తిగతమని నాగ్ చెప్పారు. సామ్-చైతన్య ఇద్దరు తన మనసుకు దగ్గరివారేనని, సామ్‌తో గడిపిన క్షణాలు తన కుటుంబం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని తెలిపాడు.

Samantha demanding crores of alimony akkineni family

Samantha demanding crores of alimony akkineni family

ఇకపోతే ఆమె ఎప్పటికీ తమకు ప్రియమైన వ్యక్తేనని, వారిద్దరికీ ఆ దేవుడు ఆత్మస్థైర్యం ప్రసాదించాలని తాను కోరుకుంటున్నానని నాగ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసి నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. కోడలు సమంత తన కొడుకు నాగచైతన్యకు విడాకులు ఇవ్వబోతున్నదని నాగార్జున బాధపడుతున్నట్లు ఈ ట్వీట్ ద్వారా అర్థమవుతున్నదని నెటిజన్లు అంటున్నారు.

praveen T

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp