Niharika Konidela : విడాకుల తర్వాత తొలిసారి మీడియాతో నిహారిక.. ఇదంతా అనుకోకుండా జరిగింది

Authored By Breaking News 2 | The Telugu News | Published on: October 21, 2023, 4:00 pm

Niharika Konidela : నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి ఆడవాళ్లలో ఇండస్ట్రీకి వచ్చింది తను మాత్రమే. మెగా ఫ్యామిలీలో చాలామంది మహిళలు ఉన్నా ఎవ్వరూ ఇండస్ట్రీలో నటన గురించి ఆలోచించలేదు. కానీ.. అందరికంటే భిన్నంగా నిహారిక మాత్రం ఇండస్ట్రీలోకి వచ్చి హీరోయిన్ అయింది. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించినా తనకు అనుకున్నంత గుర్తింపు రాలేదు. దీంతో కొన్నాళ్లు ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత తండ్రి చెప్పిన సంబంధానికి ఓకే చెప్పింది. చైతన్యను పెళ్లి చేసుకుంది. అసలు సినిమా ఇండస్ట్రీలోనే నిహారిక పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్ లో తన పెళ్లి ఘనంగా జరిగింది. తన పెళ్లి గురించి ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంది.

కానీ.. తన పెళ్లి కొన్నేళ్లకే పెటాకులు అయింది. పెళ్లి అయి కొన్నేళ్లు అయినా నిహారిక పిల్లలను కనలేదు. ఆ తర్వాత కొన్నేళ్లకే నిహారిక, చైతన్య ఇద్దరూ విడిపోయినట్టు వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు పుల్ స్టాప్ అయితే పెట్టలేదు కానీ.. చివరకు ఇద్దరం నిజంగానే విడాకులు తీసుకున్నాం అని నిహారిక, చైతన్య ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇక.. ఆ తర్వాత చాలా రోజుల పాటు నిహారిక బయట తిరగలేదు. అస్సలు ఎక్కడా కనిపించలేదు. తొలిసారి విడాకులు తర్వాత మీడియాతో మాట్లాడింది నిహారిక. తాజాగా హైదరాబాద్ లో నైరా సిల్క్స్ పేరుతో కంచి శారీ హౌస్ ను ప్రారంభించింది. తనతో పాటు వరుణ్ సందేష్ భార్య వితికా షేరు కూడా ఈ స్టోర్ ను లాంచ్ చేసింది.

niharika konidela first comment after divorce

#image_title

Niharika Konidela : కంచి పట్టు చీరలన్నీ ఒకే చోట దొరుకుతున్నాయి

నైరా సిల్క్స్ లో కంచి పట్టు చీరలన్నీ ఒకే స్టోర్ లో దొరుకుతాయి అని నిహారిక చెప్పింది. మీకు నచ్చిన శారీలను కొనుక్కోండి అని చెప్పింది నిహారిక. తన విడాకుల తర్వాత తొలిసారి చాలా సంతోషంగా కనిపించింది నిహారిక. అంటే.. తన విడాకులను మరిచిపోయి మళ్లీ కొత్త జీవితాన్ని నిహారిక ప్రారంభిస్తున్నట్టు తనను చూస్తే అనిపిస్తోంది.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp