Pawan Kalyan : పవన్ కళ్యాణ్ టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు. ఆయన వెండితెరపై కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. పవన్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నారు. డిప్యూటీ సీఎంగా కూడా ఆయన తన బాధ్యతలని నిర్వర్తిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ హోస్ట్గా ఓ షో రూపొందాల్సి ఉండగా, అది ఆగిపోయిందనే ఓ టాక్ ఇప్పుడు నడుస్తుంది. పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ కూడా హోస్ట్ అవతారం ఎత్తబోయి కొంచెంలో మిస్ అయ్యాడట. అది కూడా భారీ రేటింగ్ ఉండే ఈటీవీలో .. రామోజీ రావు ఆద్వార్యంలో ఓ భారీ రియాల్టీ షోను ప్లాన్ చేశారట. ఈ షోను పవర్ చేతే చేయించాలని రామోజీరావ్ పట్టుబట్టార. అది ఏదో కాదు బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అయ్యి.. జనాలలో భారీ స్పందన సాధించిన సత్యమేవ జయతే ప్రోగ్రామ్స్ ను తెలుగులో పవన్ కళ్యాణ్ తో చేయించాలి అనుకున్నాడట రామోజీ.
సత్యమేవ జయతే కార్యక్రమానికి ఆమీర్ ఖాన్ హోస్టింగ్ చేశారు. ఆయన ఇలా సమాజానికి మంచి చేసేవాటిలో ముందు ఉంటాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా అలానే సమాజసేవకు ముందు ఉంటారు కాబట్టి.. పవన్ చేత ఈ ప్రోగ్రామ్ చేయించాలి అని రామోజీరావు అన్ని రెడీ చేసుకున్నారట. ఈ ప్రోగ్రామ్ కోసం పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కాని కొన్ని కారణాల వల్ల ఇది డిలే అవూతు వచ్చింది. అంతే కాదు ఈలోపు పవన్ పార్టీ పెట్టడం.. రాజకీయంగా బిజీ అవ్వడంతో ఈకాన్సెస్ప్ట్ మరుగున పడిపోయింది. ఇక పవన్ తప్పించి ఈ ప్రోగ్రామ్ కు ఎవరూ బాగోరు అన్న ఆలోచనలో రామోజీరావు కూడా ఈప్రయత్నం విరమించారట.
ఇలా పవన్ కళ్యాణ్ హోస్టింగ్ చేయాల్సిన ఓప్రోగ్రామ్ ను ఫ్యాన్స్ మిస్ అయ్యారు. ఇక ఇప్పుడు ఆయన రాజకీయాలతో పాటు.. ప్రభుత్వంలో భాద్యాతాయుతమైన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. పిఠాపురం మహిళలకు డిప్యూట సీఎం పవన్ కళ్యాణ్ పంపించిన స్పెషల్ గిఫ్ట్లు పంపిణీ చేశారు. శ్రావణ మాసం చివరి శుక్రవారం పిఠాపురంలోని శక్తిపీఠం శ్రీ పురూహూతిక అమ్మవారి ఆలయంలో సంప్రదాయబద్ధంగా వరలక్ష్మీ వ్రత పూజలు నిర్వహించారు. వ్రతంలో పాల్గొన్న ఆడపడుచులకు స్థానిక శాసనసభ్యులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత ఖర్చులతో పంపిన పసుపు, కుంకుమ, చీరలు అందజేశారు. పవన్ తరఫున ఆయన వదిన, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు సతీమణి శ్రీమతి పద్మజ, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ పంపిణీ చేశారు. వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్న ఆడపడుచులందరికీ పసుపు, కుంకుమ, చీరలు కానుకగా అందజేశారు. కొణిదెల పద్మజ ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, బొట్టు పెట్టి మరీ సారె అందించారు.
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
Eating Snails : నత్తల గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలిసే ఉంటుంది. అయితే కొన్నిచోట్ల నత్తల కూరను తినడానికి చాలా…
This website uses cookies.