Pooja Hegde : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇటీవల వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఆయన ప్రస్తుతం మహేష్ ప్రధాన పాత్రలో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే సెట్స్ పైకి వెళ్ళిన ఈ చిత్రం తొలి షెడ్యూల్ను పూర్తి చేసుకోగా, ఇటీవల మహేష్ తల్లి ఇందిరా దేవి కన్ను మూయడంతో ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్కి బ్రేక్ పడింది. తల్లి మరణానంతర కార్యక్రమాలు పూర్తి చేసిన మహేష్ షూటింగ్లో పాల్గొనే ప్రయత్నాలు చేస్తున్న సమయంలో తండ్రి చనిపోవడంతో షూటింగ్ మరి కొద్ది రోజులు వాయిదా పడింది. డిసెంబర్లో చిత్ర షూటింగ్ తిరిగి మొదలు కానున్నట్టు సమాచారం.
ఇటీవలే ఓ యాడ్ షూట్లో పాల్గొన్న మహేష్.. బ్యాక్ టు వర్క్ అంటూ ఓ పోస్ట్ పెట్టాడు. త్రివిక్రమ్ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ చేసి.. వీలైనంత త్వరగా పూర్తి చేసేలా ప్లాన్స్ చేస్తున్నాడు. కానీ ఇప్పుడు హీరోయిన్ పూజా హెగ్డే డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో షూట్కి మరింత ఆలస్యం అయ్యేట్టు కనిపిస్తుంది. ఈలోపు మహేష్బాబుతో పాటు తమన్, త్రివిక్రమ్, నిర్మాత నాగవంశీ మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టారని సమాచారం. ఇక ఇందులో విలన్ పాత్రకోసం బాలీవుడ్ స్టార్స్ పేర్లు వినిపించగా, ఫైనల్గా సైఫ్ అలీఖాన్ను ఫిక్స్ చేశారనే టాక్ ప్రచారంలో ఉంది. దీనిపై మూవీ టీమ్ నుంచి అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న సినిమా రిలీజ్ కానుంది.
అయితే ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఓ వార్త హల్చల్ చేస్తుంది. ఇందులో తమన్నాని ఐటెం భామగా సెలక్ట్ చేయాలని అనుకుంటున్నాడట. ఇంత వరకు త్రివిక్రమ్- తమన్నా కాంబినేషన్లో మూవీ రాలేదు. అలా ఎందుకు జరిగిందో కూడా తెలియదు. తమన్నాని తన సినిమాలో హీరోయిన్గా తీసుకోవల్సిన త్రివిక్రమ్.. ఐటెం భామగా తీసుకోవడం పట్ల ఫ్యాన్స్ కొంత హర్ట్ అవుతున్నారు. అయితే ఇందులో తమన్నా సాంగ్ ఆమెకు మరింత క్రేజ్ తెచ్చిపెడుతుందని టాక్. పూజా హెగ్డే హీరోయిన్ అయిన ఆమె కన్నా ఎక్కువ పేరు తమన్నాకే వచ్చేలా ఆయన ప్లాన్ చేసినట్టు సమాచారం.
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
This website uses cookies.