Prabhas : బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. అయితే ప్రభాస్ని కలవాలని, ఆయనతో ముచ్చటించాలని చాలా మంది అనుకుంటారు. కాని అది కావడం లేదు. అందరి హీరోల మాదిరిగా ప్రభాస్ పెద్దగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడు. చాలా తక్కువ విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ ఉంటాడు. మొదట ఫేస్ బుక్ మాత్రమే ప్రభాస్ కలిగి ఉండేవాడు. ఈమద్య ఇన్ స్టా గ్రామ్ లో జాయిన్ అయ్యాడు. ఆయన ట్విట్టర్ ఎంట్రీ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అభిమానుల కోరిక మేరకు ప్రభాస్ ట్విట్టర్ లో జాయిన్ అవ్వబోతున్నాడనే సమాచారం అందుతోంది. ప్రభాస్ ను ఆయన అభిమానులు మరియు సన్నిహితులు చాలా రోజులుగా ట్విట్టర్ లో జాయిన్ అవ్వాలంటూ ఒత్తిడి తీసుకు వస్తున్నారు. ఎట్టకేలకు ప్రభాస్ అభిమానుల కోసం ట్విట్టర్ లో జాయిన్ అయ్యేందుకు ఓకే చెప్పాడని సమాచారం అందుతోంది. ఏ సమయంలో అయినా కూడా ప్రభాస్ ట్విట్టర్ లో మొదటి ట్వీట్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన ట్విట్టర్ లో ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా ఫాలోవర్స్ సంఖ్య తో రికార్డులు బద్దలు అవ్వడం ఖాయం అంటూ అభిమానులు అనుకుంటున్నారు. ఇటీవలే రాధేశ్యామ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఆ సినిమా నిరాశ పర్చినా కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ప్రభాస్ మొదటి బాలీవుడ్ సినిమా ఆదిపురుష్ షూటింగ్ పూర్తి చేసుకుని గ్రాఫిక్స్ వర్క్ జరుపుకుంటుంది. మరో వైపు సలార్ ఇంకా ప్రాజెక్ట్ కే సినిమాల యొక్క షూటింగ్ లు సమాంతరంగా జరుగుతున్నాయి. ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా స్పిరిట్ మరియు రాజా డీలక్స్ సినిమాలు కూడా ఉన్నాయి. ఇవి కాకుండా బాలీవుడ్ లో ఒక పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్ ను చేసేందుకు ప్రముఖ దర్శకుడికి ఓకే చెప్పడం జరిగిందట. మొత్తానికి సినిమాలతో బిజీ బిజీగా ఉన్న ప్రభాస్ త్వరలోనే ట్విట్టర్ లో కూడా బిజీ అవ్వబోతున్నాడన్నమాట. ఇక అభిమానులకి అన్ని రకాలుగా నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్ అందడం ఖాయంగా కనిపిస్తుంది.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.