Bigg Boss Telugu 7 : మాయాస్త్ర రెండు కీస్ సాధించిన శివాజీ టీమ్.. ఆ కీస్ లాక్కోబోతే కోపంతో డంబెల్స్ విసిరేసిన శివాజీ.. అందరూ షాక్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bigg Boss Telugu 7 : మాయాస్త్ర రెండు కీస్ సాధించిన శివాజీ టీమ్.. ఆ కీస్ లాక్కోబోతే కోపంతో డంబెల్స్ విసిరేసిన శివాజీ.. అందరూ షాక్

Bigg Boss Telugu 7 : మహాబలి వర్సెస్ రణధీర అనే రెండు టీమ్స్ ను ఏర్పాటు చేశాడు బిగ్ బాస్. ఈ రెండు టీమ్స్ లో ఏ టీమ్ అయినా మాయాస్త్రను సాధించాలని దాని కోసం చాలా పోటీలు ఎదుర్కోవాలని బిగ్ బాస్ పోటీ పెడతారు. రెండు పోటీలలో గెలిచిన శివాజీ టీమ్ రెండు కీలను సాధిస్తుంది. రెండు కీలు వాళ్ల దగ్గరికి చేరాయి కానీ.. మాయాస్త్ర ఎక్కడుంది. మాయాస్త్ర కోసం పోటీ ఏంటి అనేది […]

 Authored By kranthi | The Telugu News | Updated on :14 September 2023,1:00 pm

Bigg Boss Telugu 7 : మహాబలి వర్సెస్ రణధీర అనే రెండు టీమ్స్ ను ఏర్పాటు చేశాడు బిగ్ బాస్. ఈ రెండు టీమ్స్ లో ఏ టీమ్ అయినా మాయాస్త్రను సాధించాలని దాని కోసం చాలా పోటీలు ఎదుర్కోవాలని బిగ్ బాస్ పోటీ పెడతారు. రెండు పోటీలలో గెలిచిన శివాజీ టీమ్ రెండు కీలను సాధిస్తుంది. రెండు కీలు వాళ్ల దగ్గరికి చేరాయి కానీ.. మాయాస్త్ర ఎక్కడుంది. మాయాస్త్ర కోసం పోటీ ఏంటి అనేది మాత్రం ఇంకా బిగ్ బాస్ చెప్పలేదు. రెండు పోటీలలో శివాజీ టీమ్ మాత్రం గెలిచింది. ఇక.. కీస్ ఎవరు దొంగలించినా కూడా వారిదే మాయాస్త్రం అవుతుంది. కానీ.. టాస్క్ ఇచ్చిన సమయంలో ఎవ్వరూ శివాజీ టీమ్ దగ్గర్నుంచి కీస్ పొందలేకపోయారు. దీంతో ఆ మాయాస్త్రాన్ని పొందే చాన్స్ శివాజీ టీమ్ కే దక్కింది.

ranadheera team gets two keys of mayashtra

#image_title

చివరకు శివాజీ టీమ్ యాక్టివిటీ రూమ్ కి వెళ్లి అక్కడ మాయాస్త్రానికి సంబంధించిన కొన్ని అస్త్రాలను తీసుకుంటారు. అయితే.. మాయాస్త్ర కోసం శివాజీ టీమ్ ఇంత కష్టపడితే.. వాటిని ఎవరైనా లాక్కోవచ్చు అని ఇన్ డైరెక్ట్ గా బిగ్ బాస్ క్లూ ఇస్తాడు. కానీ.. వేరే టీమ్ వాళ్లు దాన్ని పట్టించుకోరు. మాయాస్త్రాన్ని లాక్కునే అవకాశం ఉన్నప్పుడు లాక్కోకుండా.. అసలు యావర్ దగ్గర కీస్ లేకున్నా యావర్ దగ్గరికి వెళ్లి యావర్ ను డిస్టర్బ్ చేస్తారు మహాబలి టీమ్.

Bigg Boss Telugu 7 : తెలుగు మాట్లాడనందుకు యావర్ కు బిగ్ బాస్ శిక్ష

అయితే.. రెండో టాస్క్ పూర్తయ్యాక.. తెలుగులో యావర్ ఎక్కువగా మాట్లాడటం లేదని.. యావర్ కు బిగ్ బాస్ ఒక శిక్ష విధిస్తాడు. ఆ శిక్షను యావర్ పూర్తి చేస్తుండగానే.. ఇతర కంటెస్టెంట్లు అతడిని శిక్ష పూర్తి చేయనీయకుండా రచ్చ రచ్చ చేస్తారు. అతడి దగ్గర కీ ఉందేమో అనుకొని అతడిని చుట్టుముడతారు. అతడిని తన టాస్క్ పూర్తి చేయనివ్వరు. దీంతో శివాజీకి కోపం వచ్చి అక్కడ ఉన్న డంబెల్స్ ను విసిరేస్తాడు. అయితే ఇదంతా యావర్ దగ్గర ఉన్న వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోవడం కోసం శివాజీ చేసిన ప్రయత్నం అది. మొత్తానికి మాయాస్త్రానికి సంబంధించి అతి చేరువలోకి వెళ్తారు శివాజీ టీమ్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది