Rashmi Gautam : గుండె ప‌గిలే వార్త‌.. ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ధ‌స్త్ క్లోజ్.. క‌న్నీరు పెట్టుకున్న ర‌ష్మీ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rashmi Gautam : గుండె ప‌గిలే వార్త‌.. ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ధ‌స్త్ క్లోజ్.. క‌న్నీరు పెట్టుకున్న ర‌ష్మీ

Rashmi Gautam : బుల్లితెర కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు.ఈ షో ద‌శాబ్ధ కాలంగా ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూనే ఉంది. జబర్ధస్త్‌ షో 2013లో ప్రారంభం అయింది. అప్పుడు వారంలో ఒకరోజు మాత్రమే ప్రసారం అయిన ఈ షో.. కొద్ది రోజుల తర్వాత రెండు రోజులకే చేరింది. ఈ క్రమంలోనే జబర్ధస్త్‌లోకి ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు వచ్చారు. వీరిలో చాలా మంది పాపులారిటీని సంపాదించుకొని స్టార్స్‌గా ఎదుగుతున్నారు. ఇక ఈ షోకు జడ్జ్‌లుగా […]

 Authored By ramu | The Telugu News | Updated on :29 May 2024,3:00 pm

Rashmi Gautam : బుల్లితెర కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు.ఈ షో ద‌శాబ్ధ కాలంగా ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూనే ఉంది. జబర్ధస్త్‌ షో 2013లో ప్రారంభం అయింది. అప్పుడు వారంలో ఒకరోజు మాత్రమే ప్రసారం అయిన ఈ షో.. కొద్ది రోజుల తర్వాత రెండు రోజులకే చేరింది. ఈ క్రమంలోనే జబర్ధస్త్‌లోకి ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు వచ్చారు. వీరిలో చాలా మంది పాపులారిటీని సంపాదించుకొని స్టార్స్‌గా ఎదుగుతున్నారు. ఇక ఈ షోకు జడ్జ్‌లుగా వ్యవహరించిన సీనియర్ హీరోయిన్ రోజా, మెగా బ్రదర్ నాగబాబు, ఇంద్రజ కూడా మరింతగా హైలైట్ అయ్యారు. యాంకర్లుగా చేసిన రష్మీ గౌతమ్, అనసూయ భరద్వాజ్ పెద్ద పెద్ద స్టార్లుగా మారిపోయారు.

Rashmi Gautam నిజంగా హార్ట్ బ్రేకింగ్..

సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతున్న స‌మ‌యంలో జబర్ధస్త్‌ షోలో ఉన్నట్లుండి కుదుపులు వచ్చాయి. మొదటి నుంచీ ఈ షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తున్న నాగబాబు, ఆ తర్వాత రోజా షో నుంచి వెళ్లిపోయారు. అలాగే మొదటి తరం కమెడియన్లు కూడా షోకి దూర‌మ‌య్యారు. ఆ స‌మ‌యంలో కొత్త వాళ్లను తెచ్చి షోను మరింత ఫన్నీగా నడిపే ప్రయత్నం చేస్తున్నారు. షో నుంచి నాగబాబు, రోజా వెళ్లిపోయిన తర్వాత ఎంతో మంది జడ్జ్‌లుగా వచ్చారు. కానీ, వాళ్లందరిలోనూ ప్రత్యేకంగా నిలిచింది మాత్రం ఇంద్రజనే అన్న విషయం తెలిసిందే. చాలా రోజులుగా ఆమె షోను సక్సెస్‌ చేయడంలో తన వంతు పాత్రను పోషిస్తుంది. కాని ఆమె కూడా జ‌బ‌ర్ధ‌స్త్ షోకి తాత్కాలిక బ్రేక్ ఇస్తున్న‌ట్టు తెలియ‌జేసింది.

Rashmi Gautam గుండె ప‌గిలే వార్త‌ ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ధ‌స్త్ క్లోజ్ క‌న్నీరు పెట్టుకున్న ర‌ష్మీ

Rashmi Gautam : గుండె ప‌గిలే వార్త‌.. ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ధ‌స్త్ క్లోజ్.. క‌న్నీరు పెట్టుకున్న ర‌ష్మీ

ఇక తాజాగా రామ్‌ ప్రసాద్‌ తన స్కిట్‌ ద్వారా ఎక్స్ ట్రా జ‌బ‌ర్ధ‌స్త్ ఉండ‌ద‌నే విషయాన్ని తెలిపారు. ఇక్కడ రెండు కంపెనీలున్నాయి. ఇప్పుడు రెండు కలిపి ఒక్కటి కాబోతుంది. ఒకటి మిస్‌ అవుతున్నందుకు బాధగా ఉంది. మొదట్నుంచి ఇందులోనే ఉన్నాను, అదే వెళ్లిపోతుండటంతో చాలా బాధగా ఉందని రామ్‌ ప్రసాద్‌ ఎమోషనల్‌ అయ్యాడు. దీంతో అటు యాంకర్‌ రష్మి, నరేష్‌, కృష్ణభగవాన్‌, ఖుష్బూ ఇలా అంతా కన్నీళ్లు పెట్టుకున్నాడు. భావోద్వేగానికి గురయ్యారు. ఇకపై నుంచి జబర్దస్త్ షో మాత్రమే ఉంటుంది. రెండింటిని కలిపి ఒకే షోగా టెలికాస్ట్ చేయబోతున్నారు.. నిజంగా ఇది హార్ట్ బ్రేకింగ్ వార్తే అని చెప్పాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది