Rashmi Gautam : కంటతడి పెట్టించేస్తోంది.. రష్మి గౌతమ్ వీడియో వైరల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rashmi Gautam : కంటతడి పెట్టించేస్తోంది.. రష్మి గౌతమ్ వీడియో వైరల్

Rashmi Gautam : బుల్లితెర రష్మి గౌతమ్ కెరీర్ చాలా కాలం క్రితమే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే చాలా చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలను పోషించింది. అలా ఎంతో కాలంగా సినీ రంగంలో కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ‘జబర్ధస్త్’ అనే కామెడీ షోతో ఆమె యాంకర్‌గా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో అద్భుతమైన హోస్టింగ్‌తో ఆకట్టుకుని ఫుల్ ఫేమస్ అయింది. ఆమె ఆర్టిస్ట్‌గానే కాకుండా సామాజిక సేవ‌ల విష‌యంలో అంద‌రి […]

 Authored By sandeep | The Telugu News | Updated on :8 March 2022,8:00 pm

Rashmi Gautam : బుల్లితెర రష్మి గౌతమ్ కెరీర్ చాలా కాలం క్రితమే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే చాలా చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలను పోషించింది. అలా ఎంతో కాలంగా సినీ రంగంలో కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ‘జబర్ధస్త్’ అనే కామెడీ షోతో ఆమె యాంకర్‌గా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో అద్భుతమైన హోస్టింగ్‌తో ఆకట్టుకుని ఫుల్ ఫేమస్ అయింది. ఆమె ఆర్టిస్ట్‌గానే కాకుండా సామాజిక సేవ‌ల విష‌యంలో అంద‌రి మ‌న్న‌న‌లు పొందింది. మూగ జీవాల గురించి రష్మీ చేసే పోస్ట్‌లు అందరినీ కదిలిస్తుంటాయి. మూగ జీవాలను హింసించడం, వాటిని మనుషులు ఎంతలా వినియోగించుకుంటున్నారో అంటూ రష్మీ ఆవేదన చెందుతుంది.

కుక్క, ఆవు, గేదె, గుర్రాలు ఇలా ప్రతీ ఒక్క జీవరాశి గురించి రష్మీ స్పందిస్తుంటుంది.ఆ మధ్య గేదె, ఆవు పాల మీద స్పందించింది. గేదెలు, ఆవులు తమ పిల్లల కోసం పాలను ఉత్పత్తి చేస్తుంటే.. మనుషులు వాటిని అవసరానికి మించి తీసుకుంటున్నారు. అవి మనషుల కోసం పాలను ఉత్పత్తి చేస్తోన్నట్టు అయింది. వాటిని మనం హింసిస్తున్నామంటూ రష్మీ చెప్పుకొచ్చింది. అందుకే తాను పాలు, పాల ఉత్పత్తులను కూడా వాడను అని తెలిపింది. ఇక తాజాగా మూగ‌జీవిని మాంసం కోసం మార్కెట్‌లో అమ్మేయ‌గా క‌న్నీరు పెట్టుకుంది.ఈ వీడియోని చూసి ర‌ష్మీ గౌతమ్ చాలా ఆవేద‌న చెందింది. అలానే డ‌స్ట్ బిన్‌లో బ్లేడ్స్ వంటివి వేయోద్దని కోరింది.

Rashmi Gautam Sad Video in Viral

Rashmi Gautam Sad Video in Viral

Rashmi Gautam : రష్మి గౌతమ్ సామాజిక స్పృహ‌

వాటి వ‌ల‌న చాలా జీవులు మ‌ర‌ణిస్తున్నాయ‌ని పేర్కొంది. ర‌ష్మీ గౌతమ్ మరీ ముఖ్యంగా వీధి కుక్కలను గాయపరిచే ఘటనలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంటుంది. ఇక నాన్ వెజ్ తినడాన్ని రష్మీ వ్యతిరేకిస్తుంటుంది. వీధి కుక్కలు గాయాలతో కనిపిస్తే రష్మీ వెంటనే వాటిని చేరదీస్తుంది. తీవ్రంగా గాయపడి ఉంటే చేతనైనంతలో ఆపరేషన్ కూడా చేయిస్తుంటుంది. ఓ సారి అలానే ఓ పెట్‌కు గాయాలయ్యాయి. ఆపరేషన్ డబ్బుల కోసం రష్మీ తన అభిమానులను రిక్వెస్ట్ చేసింది. ఒక్కొక్కరు ఒక్కో రూపాయి ఇచ్చినా చాలంటూ వేడుకుంది. అలా రష్మీ మూగ జీవాల మీద ప్రేమను కురిపిస్తుంటుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది