rashmi gautam: సమ్మటి విస్కీని, కమ్మగా తాగలంటున్న రష్మి.. నెటిజన్లు ఫైర్…!

Authored By Breaking News 2 | The Telugu News | Updated on: December 2, 2021, 11:10 am

rashmi gautam : సినీ సెలబ్రిటీలు కేవలం సినిమాల వల్లే కాదు.. యాడ్స్ ద్వారా కూడా భాగానే అర్జిస్తుంటారు. పలువురు బడా స్టార్లు ప్రతీ ఏడాది ఏకంగా కోట్లలో సంపాదిస్తున్నారు. అయితే ఈ యాడ్స్ అనేవి ప్రజలకు ఉపయోగపడే విధంగా సందేశాత్మకంగా ఉంటే సరి. లేకపోతే భారీ విమర్శలు మూట గట్టుగొక తప్పదు. తాజాగా స్టార్ట్ ఫీమేల్ యాంకర్ రష్మి కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటుంది.మద్యపాన కంపెనీలు ఈ మధ్య తమ వ్యాపార ప్రకటనలను సినీ సెలబ్రెటీల చేత ప్రమోట్ చేయిస్తున్నాయి. అందంతో పాటు అత్యధిక అభిమానులు కలిగిన హీరోయిన్స్ విస్కీ కంపెనీలు యాడ్స్ చేయించి మందుబాబులను ఆకట్టుకోవాలని చూస్తున్నాయి.

ఇప్పటికే పలు కంపెనీలు లక్ష్మీరాయ్, రెజీనా, పూజా హెగ్డేలతో వారి వారి విస్కీ బ్రాండ్లను ప్రమోట్ చేయించుకోగా తాజాగా జబర్థస్త్ యాంకర్ రష్మి ఈ జాబితాలో చేరిపోయింది. సమ్మటి విస్కీ, కమ్మటి వాసన అందుకే… ఎంసీ నంబర్ వన్ అంటూ కమెడియన్లు చలాకి చంటి, అవినాష్ లతో కలిసి బ్రాండ్‌ను ప్రమోట్ చేసింది. అయితే ఇదే ఇప్పుడు ఆమెను వివాదాల్లో పడేలా చేసేటట్లు ఉంది. ఇప్పుడు ఈ ప్రమోషనల్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Rashmi wisky promotion ad going viral in social media

Rashmi wisky promotion ad going viral in social media

rashmi gautam : సమ్మటి విస్కీ, కమ్మటి వాసన అంటూ:

డబ్బు కోసం ఇంత జనాలను మద్యం సేవించాల్సిందిగా ప్రచారం చేస్తారా..? అంటూ నెటిజన్లు రష్మి పై ఫైర్ అవుతున్నారు. ఇలాంటి యాడ్స్‌లో నటిస్తూ మీ అభిమానులకు మీరు ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. సంపాదన కోసం ఇలాంటి ప్రకటనల్లో నటిస్తారా…? అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. సక్సెస్ ఫుల్ యాంకర్ గా ఓ బాధ్యత గల సెలబ్రెటీగా మీరే ఇలా చేస్తే ఎలా అని నిలదీస్తున్నారు.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp