Roja : తల్లిని మించిపోతున్న తనయ.. ఆ విషయంలో రోజాకే గట్టపోటీనిస్తున్న ఆమె కూతురు.. | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Roja : తల్లిని మించిపోతున్న తనయ.. ఆ విషయంలో రోజాకే గట్టపోటీనిస్తున్న ఆమె కూతురు..

Roja : సినిమాల్లో హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి రోజా.. ఆ తర్వాత కాలంలో రాజకీయాల్లోకి వచ్చి సత్తా చాటుతోంది. ప్రజెంట్ ఓ వైపు బుల్లితెరపైన సందడి చేస్తూనే మరో వైపున రాజకీయాల్లో కొనసాగుతోంది. కాగా, ఓ విషయంలో ఆమె కూతురు ఆమెకే పోటీనిస్తుందట.వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్‌గా ఉన్న రోజా.. పేద పిల్లలను తన సొంత డబ్బులతో చదవిస్తుంది. నగరి ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గ ప్రజలకు రోజా సేవలందిస్తున్నది. కాగా, తల్లిబాటలోనే తనయ […]

 Authored By mallesh | The Telugu News | Updated on :15 November 2021,10:00 pm

Roja : సినిమాల్లో హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి రోజా.. ఆ తర్వాత కాలంలో రాజకీయాల్లోకి వచ్చి సత్తా చాటుతోంది. ప్రజెంట్ ఓ వైపు బుల్లితెరపైన సందడి చేస్తూనే మరో వైపున రాజకీయాల్లో కొనసాగుతోంది. కాగా, ఓ విషయంలో ఆమె కూతురు ఆమెకే పోటీనిస్తుందట.వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్‌గా ఉన్న రోజా.. పేద పిల్లలను తన సొంత డబ్బులతో చదవిస్తుంది. నగరి ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గ ప్రజలకు రోజా సేవలందిస్తున్నది. కాగా, తల్లిబాటలోనే తనయ అన్షుమాలిక కొనసాగుతున్నది.

చిన్న వయసులోనే అన్షుమాలిక ఓ ఎన్టీవో ద్వారా ఐదుగురు పిల్లలను దత్తత తీసుకుంది. తన తనయ ఇలా చిన్న వయసులోనే సొసైటీ కోసం ఆలోచించడం చూసి రోజా గర్వపడుతున్నది. ఇంత చిన్న వయసులోనే తన కూతురికి అటువంటి ఆలోచన రావడం గొప్ప విషయమని పేర్కొంది రోజా. ఇకపోతే రోజా తన కూతురు గురించి మీడియాతో మాట్లాడుతూ తన కూతురుకు చదువు అంటే చాలా ఇష్టమని, నిరంతరం పుస్తకాలు చదువుతూనే ఆమె ఉంటుందని తెలిపింది.

roj daughter compete with hermother

roj daughter compete with hermother

Roja : తల్లిబాటలోనే కూతురు..

ఈ విషయం తెలుసుకుని చాలా మంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తల్లికి తగ్గ తనయ అన్షు మాలిక అని అంటున్నారు. సొసైటీకి సేవ చేసే విషయంలో తల్లి రోజాను అన్షుమాలిక మించి పోతుందని పొగిడేస్తున్నారు. ఇకపోతే రోజా వైసీపీ నాయకురాలిగా చెరగని ముద్ర వేసుకున్నదని చెప్పొచ్చు. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయిన వారిలో రోజా ఒకరు. కాగా, ఈమె తనకంటూ ఓ డిఫరెంట్ స్టైల్ ఏర్పరుచుకుందని పలువురు సినీ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

రోజా పొలిటికల్ ఎంట్రీ టీడీపీతో జరిగినప్పటికీ ఆ తర్వాత కాలంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే ఆమె వైసీపీలో చేరింది. వైసీపీ తరఫున బలమైన వాదనలను వినిపిస్తూ టీడీపీ వాదనలను ఎప్పటికప్పుడు విమర్శిస్తూ ఫైర్ బ్రాండ్ లీడర్‌గా రోజా పేరు తెచ్చుకుంది. వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహితురాలిగా రోజా కొనసాగుతోంది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది