Sai Pallavi : సాయి ప‌ల్ల‌వి ఏంటి ఇలా వివాదంలో ఇరుక్కుంది.. క్ష‌మాప‌ణ‌లు చెప్పక త‌ప్ప‌దా?

Authored By Sam C | The Telugu News | Published on: June 15, 2022, 10:00 pm

Sai Pallavi : సాయి పల్లవి .. రానా జంటగా నటించిన మూవీ విరాట పర్వం . త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా టీం ప్రమోషన్లలో బిజీగా మారింది. అయితే ప్రమోషన్ల కోసం తాజాగా సాయి పల్లవి పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తుంది. ఈ క్ర‌మంలో సాయి ప‌ల్ల‌వి ప‌లు సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. విరాట పర్వం నక్సల్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో తెరకెక్కిన సినిమా. ఈ సినిమా గురించి ప్రస్తావిస్తూ.. సాయి పల్లవి ఈ మధ్యనే కశ్మీర్ ఫైల్స్ సినిమా చూశానని చెప్పుకొచ్చింది.

కొద్ది రోజుల క్రితం కాశ్మీరీ ఫైల్స్ అనే సినిమా వచ్చింది కదా ఆ సినిమాలో ఎలా చంపారు, అనే విషయాలను చూపించారు. మనం వాటిని ఒక మత సంఘర్షణలాగానే చూస్తే ఇప్పుడు రీసెంట్ గా బండిలో కౌ(ఆవు)లు తీసుకు వెళుతున్నారు. బండిలో డ్రైవర్ ముస్లింగా ఉన్నాడు అని కొంతమంది కట్టేసి జైశ్రీరామ్ జైశ్రీరామ్ అని అనమంటున్నారు. అలా అయితే అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి తేడా ఎక్కడ ఉంది? మతాలు కాదు మనం మంచి వ్యక్తిగా ఉంటే ఇతరులను ఇబ్బంది పెట్టము, లెఫ్టిస్ట్, రైటిస్ట్ కాదు, మనం మంచిగా ఉండకపోతే న్యాయం ఎక్కడా ఉండదు అని ఆమె చెప్పుకొచ్చింది.

Sai Pallavi is embroiled in a controversy

Sai Pallavi is embroiled in a controversy

Sai Pallavi ; వివాదంలో ఇరుక్కుందా?

అయితే ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. ఈ విషయం మీద సాయిపల్లవి వ్యవహారంలో దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. కొంతమంది సాయి పల్లవి మాట్లాడిన దాంట్లో తప్పేముంది అని ప్రశ్నిస్తుంటే మరికొందరు మాత్రం సాయి పల్లవికి చరిత్ర తెలియదు చరిత్ర తెలుసుకుని మాట్లాడమని కామెంట్ చేస్తున్నారు. కొందరైతే సాయి పల్లవి దుర్మార్గమైన వ్యాఖ్యల నేపథ్యంలో మేము విరాటపర్వం సినిమాని చూడడం లేదు అని మా తరపునుంచి మేము సినిమాను బాన్ చేసుకుంటున్నాము అంటూ కూడా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మ‌రి దీనిపై సాయి ప‌ల్ల‌వి స్పందిస్తుందా అన్నది చూడాలి.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp