Samantha : సమంత దుకుడు.. రూ.100 కోట్లు తస్మాత్‌ జాగ్రత్త

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 24 June 2022, 4:30 pm

Samantha : టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ సమంత చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. నాగ చైతన్య తో విడాకుల తర్వాత ఆమె సోషల్‌ మీడియా లో హాట్‌ ఫోటోలు షేర్‌ చేయడం మొదలుకుని ప్రతి విషయంలో కూడా స్పీడ్ గా వ్యవహరిస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. సోషల్‌ మీడియాలో ఆమె నెటిజన్స్ కు ఇస్తున్న సమాధానాలు కొన్ని తెలుగు ప్రేక్షకులు మింగుడు పడటం లేదు. నాగ చైతన్య నుండి విడి పోయిన తర్వాత ఆమె వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పటికే చాలా మంది విమర్శలు చేయడం మనం చూస్తూ ఉన్నాం. వాటికి ఆమె నుండి వస్తున్న సమాధానం కూడా మనం చూస్తూ ఉన్నాం.

ఇలాంటప్పుడు ఆమె మరింతగా తెలుగు వారికి ఘాటు సమాధానాలు ఇస్తుండటంతో ఆమె నటించిన సినిమాలపై ప్రభావం పడే అవకాశం ఉంది అంటున్నారు. తెలుగు ప్రేక్షకులకు సమంత పై ఇప్పటికే పీకలలోతు కోపం ఉండి ఉంటుంది. ఎందుకంటే చాలా ఇన్నోసెంట్ అయిన నాగ చైతన్య ను సమంత మోసం చేసి విడి పోయింది. ఆమె అత్యుత్సాహం వల్ల నాగ చైతన్య జీవితంలో చాలా మిస్ అయ్యాడు అనేది తెలుగు వారు.. ముఖ్యంగా అక్కినేని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆమెను తెలుగు లో చాలా మంది వ్యతిరేకిస్తూ ఉన్నారు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే అదే వంద కోట్ల సినిమాలపై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

samantha comments going to damage to shakunthalam and yashodha movies

samantha comments going to damage to shakunthalam and yashodha movies

గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం శాకుంతలం సినిమా విడుదలకు సిద్దం అవుతుంది. ఆ సినిమా ను భారీ ఎత్తున గ్రాఫికల్‌ విజువల్ వండర్‌ గా చూపించేందుకు గాను దర్శకుడు ప్లాన్‌ చేస్తున్నాడు. మరో వైపు లేడీ ఓరియంటెడ్‌ మూవీ యశోద కూడా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ రెండు సినిమా లు కూడా దాదాపుగా వంద కోట్ల వరకు వసూళ్లు చేసే అవకాశం ఉంది. అంతకు మించి కూడా రాబట్టే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో తెలుగు వారితో సున్నం పెట్టుకుంటే.. తెలుగు ప్రేక్షకుల పట్ల ఇష్టానుసారంగా మాట్లాడితే ఆ రెండు సినిమాల నిర్మాతలు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి