Samantha : మరింత క్షీణించిన సమంత ఆరోగ్యం.. అపోలోకి తరలింపు..?

Authored By Breaking News | The Telugu News | Updated on: November 22, 2022, 1:05 pm

Samantha : హీరోయిన్ సమంత మయోసైటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధి ప్రాణాంతకరం కావటంతో సామ్ అబిమానులు తెగ అందోళనలు చెందుతున్నారు. ప్రస్తుతం సమంతకి మూడో స్టేజిలో ఉంది. నెల రోజుల క్రితం మయోసైటీస్ కి సంబంధించి చికిత్స తీసుకుంటూ ఉంది. ఇదిలా ఉంటే ఒకపక్క చికిత్స తీసుకుంటూనే మరోపక్క తన ఫస్ట్ పాన్ ఇండియా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా “యశోద” ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనడం తెలిసిందే.

నవంబర్ 11 వ తారీకు “యశోద” సినిమా విడుదలయ్యి అద్భుతమైన విజయం సాధించింది. అయితే అంతకుముందు వారం రోజులు పాటు ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాల్లో.. సమంత తన ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా పాల్గొంది. అయితే ఆ సమయంలో సరైన డైట్ తీసుకోకపోవడంతో పాటు సరైన టైంలో ట్రీట్మెంట్ నీ కూడా నిర్లక్ష్యం చేయడంతో సమంత ఆరోగ్యం ఇప్పుడు మరింత క్షీణించడం జరిగిందట. దీంతో ఆమెను ఇప్పుడు హోటల్ హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో జాయిన్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Samantha health deteriorated further move to apollo

Samantha health deteriorated further move to apollo

“యశోద” ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా సరిగ్గా ఆహారం తీసుకోపోకపోవడంతో…రీసెంట్ గా …ఆమె బాగా నీరసించిపోయి కండరాలు నొప్పి ఎక్కువైపోయి.. స్పృహ తప్పి పడిపోయిందట. దీంతో వైద్యులు వెంటనే సమంతని.. హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో చేర్పించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె ఆరోగ్యం పూర్తిగా విషమించినట్లు సమాచారం. మరోపక్క బయట జరుగుతున్న ఈ ప్రచారంపై సమంత బంధువులు లేదా ఆమె పిఆర్ టీం నుండి ఎటువంటి స్పందన లేదు.

 

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp