Samantha : నాగచైతన్య, సమంత విడాకులతో వీళ్లకు ఇబ్బంది.. వారి కోసం మళ్లీ కలుస్తారా?

Authored By mallesh | The Telugu News | Published on: December 29, 2021, 9:40 pm

Samantha : టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్‌గా ఉన్న అక్కినేని నాగచైతన్య, సమంత డైవోర్స్ తీసుకుని ఎవరి లైఫ్ వారు అనుభవిస్తున్నారు. ప్రజెంట్ ఎవరి చిత్రాల్లో వారు ఫుల్ బిజీగా ఉన్నారు. ఇద్దరు తమ ప్రొఫెషనల్ లైఫ్‌ను చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. సమంత వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉంది. నాగచైతన్య కూడా తాను ఓకే చేసిన ప్రాజెక్ట్స్‌ షూటింగ్స్‌లో పాల్గొంటున్నాడు. కాగా, వీరు కలిసి ఉన్నపుడు కోల్గేట్ టూత్ పేస్ట్‌కు బ్రాండ్ అంబాసిడర్స్‌గా ఉన్నారు. మ్యారేజ్ తర్వాత వీరికి ఈ బ్రాండ్ ప్రమోషన్స్ కోసం వచ్చింది. అలా వీరు బ్రాండ్ అంబాసిడర్స్ అయ్యారు.

‘కోల్గేట్ మౌత్ ఫ్రెష్’కు నాగచైతన్య, ‘కోల్గేట్ సాల్ట్‌’కు సమంత ప్రమోటర్స్‌గా ఉన్నారు. కాగా, వీరు విడిపోవడంతో ఇప్పుడు ఈ కంపెనీ వారికి పెద్ద చిక్కు వచ్చి పడింది.నాగచైతన్య, సమంతల డైవోర్స్ వలన తమకు ఇబ్బంది వచ్చిందనే చర్చ ముంబై యాడ్ ఏజెన్సీ వర్గాల్లో ఉందట. భార్యా భర్తలుగా విడిపోయినప్పటికీ ప్రొఫెషనల్ రిలేషన్ షిప్‌లో భాగంగా నాగచైతన్య, సమంత ఇద్దరూ కలిసి కోల్గేట్ కోసం బ్రాండ్ అంబాసిడర్స్‌గా పని చేస్తారా? అనేది తేలాల్సి ఉంది. నాగచైతన్యతో డైవోర్స్ తర్వాత తాను మనోవేదనకు గురైనట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో తన పోస్టుల ద్వారా సమంత తెలిపింది.

samantha naga chaitanya will be working together for organisation

samantha naga chaitanya will be working together for organisation

Samantha : ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటారా.. లేదా కలుస్తారా..!

ఈ క్రమంలోనే మరోసారి నాగచైతన్యతో షూటింగ్‌లో భాగంగానైనా సమంత కలుస్తుందా? అనేది చర్చనీయాంశంగా మారింది. డైవోర్స్ తర్వాత నాగచైతన్య సోషల్ మీడియాలో పెద్దగా పోస్టులు అయితే పెట్టలేదు. కాగా, సమంత మాత్రం సోషల్ మీడియాలో ప్రతీ రోజు యాక్టివ్‌గానే ఉంటుంది. తనను ట్రోల్ చేసే వారికి దిమ్మదిరిగిపోయే కౌంటర్స్ ఇస్తోంది. ఈ క్రమంలోనే నాగచైతన్య, సమంత కోల్గేట్ బ్రాండ్ అంబాసిడర్స్‌గా మళ్లీ కలుస్తారా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా ఉంది. వీరిరువురు కలుసుకునేందుకుగాను కోల్గేట్ సంస్థ వారు ఏమైనా చొరవ తీసుకుంటారో లేదో.. చూడాలి మరి..

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp