SHANMUKH JASWANTH : షన్ను ఎంగేజ్మెంట్ అని తెలిసి దీప్తి సునైన సంచలన నిర్ణయం : | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

SHANMUKH JASWANTH : షన్ను ఎంగేజ్మెంట్ అని తెలిసి దీప్తి సునైన సంచలన నిర్ణయం  :

 Authored By siddhu | The Telugu News | Updated on :26 February 2026,5:00 pm

ప్రధానాంశాలు:

  •  SHANMUKH JASWANTH : షన్ను ఎంగేజ్మెంట్ అని తెలిసి దీప్తి సునైన సంచలన నిర్ణయం ..

SHANMUKH JASWANTH : సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక సంచలనం సృష్టిస్తూ ఉండే షణ్ముఖ్ జస్వంత్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారాడు. యూట్యూబ్ స్టార్ గా కెరీర్ మొదలుపెట్టి బిగ్ బాస్ వరకు వెళ్ళిన షన్ను ప్రయాణం అందరికీ తెలిసిందే. అయితే గత కొంతకాలంగా షణ్ముఖ్ తన వ్యక్తిగత కారణాల వల్ల వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం షణ్ముఖ్ జస్వంత్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నాడనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఇంట్లో వారు చూసిన అమ్మాయితో షణ్ముఖ్ నిశ్చితార్థం కూడా జరిగింది. డానికి సంబంధించిన వీడియోస్ కూడా అతనే పోస్ట్ చేసాడు. వైష్ణవి అనే అమ్మాయితో అతనికి ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ వార్త బయటకు రావడంతో అటు షణ్ముఖ్ అభిమానులు ఇటు దీప్తి సునైన ఫాలోవర్స్ షాక్ అవుతున్నారు.

SHANMUKH JASWANTH షన్ను ఎంగేజ్మెంట్ అని తెలిసి దీప్తి సునైన సంచలన నిర్ణయం

SHANMUKH JASWANTH : షన్ను ఎంగేజ్మెంట్ అని తెలిసి దీప్తి సునైన సంచలన నిర్ణయం  :

దీప్తి సునైన నిర్ణయం

షణ్ముఖ్ జస్వంత్ మరియు దీప్తి సునైనల ప్రేమాయణం గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పక్కర్లేదు. వీరిద్దరూ చాలా ఏళ్ల పాటు ప్రేమలో ఉండి అందరికీ ఆదర్శంగా కనిపించారు. కానీ బిగ్ బాస్ సిరి వ్యవహారం తర్వాత వీరిద్దరి మధ్య గ్యాప్ రావడం అది కాస్తా బ్రేకప్ వరకు వెళ్లడం చకచకా జరిగిపోయాయి. అయితే షణ్ముఖ్ ఇప్పుడు వేరొక అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడని తెలియడంతో దీప్తి సునైన ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత జ్ఞాపకాలను పూర్తిగా చెరిపేస్తూ తన కెరీర్ మీద మాత్రమే దృష్టి పెట్టాలని ఆమె ఫిక్స్ అయినట్లు సమాచారం. గతం గురించి ఆలోచించడం మానేసి జీవితంలో ముందుకు వెళ్లడమే మంచిదని తన సన్నిహితులతో అన్నట్లు టాక్ వినిపిస్తోంది.

దీప్తి సునైన తన సోషల్ మీడియా ఖాతాలలో పెడుతున్న పోస్టులు చూస్తుంటే ఆమె మనసులో ఏదో నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. షణ్ముఖ్ వివాహం గురించి వస్తున్న వార్తలపై ఆమె నేరుగా స్పందించకపోయినా తన లైఫ్ లో ఇకపై ఒంటరిగానే ప్రయాణం కొనసాగించాలని లేదా తన లక్ష్యాల కోసం కష్టపడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా షన్నుకు సంబంధించిన ఎటువంటి జ్ఞాపకాలను కూడా ఉంచుకోవడానికి ఆమె ఇష్టపడటం లేదట. ఒక రకంగా చెప్పాలంటే పాత బంధాన్ని పూర్తిగా వదిలేసి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయడానికి ఆమె సిద్ధమైంది.

ప్రస్తుతం దీప్తి సునైన వరుస వెబ్ సిరీస్ లు మరియు మ్యూజిక్ ఆల్బమ్స్ తో బిజీగా ఉంటోంది. షణ్ముఖ్ నిశ్చితార్థం వార్త విన్న తర్వాత ఆమె ఏమాత్రం కుంగిపోకుండా మరింత ధైర్యంగా తన పని తాను చేసుకుంటూ వెళుతోంది. ఈ నిర్ణయం ద్వారా ఆమె తన అభిమానులకు ఒక మెసేజ్ ఇస్తోంది. జీవితంలో ఏది జరిగినా ఆగిపోకూడదని మన కోసం మనం బ్రతకాలని ఆమె నిరూపిస్తోంది. మొత్తానికి షణ్ముఖ్ పెళ్లి వార్త తెలుగు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీయగా దీప్తి సునైన తీసుకున్న ఈ గట్టి నిర్ణయం ఆమె అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది. ఎవరి దారి వారు చూసుకోవడమే ఇద్దరికీ మంచిదని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

 

siddhu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది