Mahesh Babu director gives clarity
Mahesh Babu : బాహుబలి తర్వాత రాజమౌళి తగ్గేదే లే అంటున్నాడు. అన్ని భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తూ అలరిస్తున్నాడు. చివరిగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ చిత్రం తెరకెక్కించారు. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక రానున్న రోజుల్లో మరిన్ని వసూళ్లను అందుకునే అవకాశం ఉందనే చెప్పాలి. ఇక మొత్తానికి సినిమా సక్సెస్ అయింది కాబట్టి ఈ సినిమా కోసం పని చేసిన అందరూ ఇప్పుడు రెస్ట్ మోడ్ లో ఉన్నారు. అయితే రాజమౌళి మాత్రం తర్వాతి సినిమాకి సంబంధించి ప్రణాళికలు రచిస్తూనే ఉన్నాడు.
ప్రస్తుతం మహేష్ బాబుతో చేయబోతోన్న సినిమా మీద రాజమౌళి తన దృష్టి పెట్టేశాడు. అయితే ఇంత వరకు ఈ సినిమాకు సంబంధించి కొన్ని విషయాలు మాత్రం వచ్చాయి. రైటర్ విజయేంద్ర ప్రసాద్ కొన్ని విషయాలు చెప్పాడు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఈ కథ రాస్తున్నాను అంటూ ఆ మధ్య హింట్ ఇచ్చాడు. ఇక రాజమౌళి తాజాగా మాట్లాడుతూ.. దాన్ని దాదాపు కన్ఫామ్ చేేసేశాడు. యాక్షన్ అడ్వంచర్ జానర్లో ఈ సినిమా ఉంటుందని తెలిపాడు. అంతే కాకుండా రెండు కథలు కూడా అనుకుంటున్నామని చెప్పుకొచ్చాడు. అంటే ఈ రెండు కథల్లో ఏదో ఒకటి మహేష్ బాబు సెలెక్ట్ చేసుకుంటాడన్న మాట.
SS rajamouli plans two stories for Mahesh Babu
మొత్తానికి ఈ ఏడాదిలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లబోతోందని తెలుస్తోంది.కానీ కరోనా వల్ల ‘ఆర్ఆర్ఆర్’ విడుదలకు ముందు కొంత గ్యాప్ వచ్చింది. జనవరి 7న సినిమాను విడుదల చేయాలనుకుంటే… కరోనా కారణంగా మార్చి 25కి వాయిదా వేయాల్సి వచ్చింది. ఆ గ్యాప్లో మా నాన్న ఫోన్ చేసి ‘టైమ్ వేస్ట్ చేయకు. కథ మీద కూర్చుందాం’ అన్నారని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో కొన్ని లైన్స్ డిస్కస్ చేసుకున్నామని వెల్లడించారు. మహేష్ బాబుతో చేయబోయేది యాక్షన్ అడ్వెంచర్ అని దానికి రెండు కథలు నా మైండ్ లో ఉన్నాయని అన్నారు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని ఆ సినిమా స్టోరీ మీద మళ్ళీ కూర్చుంటామని రాజమౌళి చెప్పుకొచ్చారు.
Toli Ekadashi 2025 : శ్రావణ శుద్ధ ఏకాదశి అంటే భక్తులకు ప్రత్యేకమే. దీనిని "దేవశయని ఏకాదశి" Toli Ekadashi…
7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ (DA) పెంపు జరగబోతుంది. తాజా సమాచారం…
Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు…
Mars Ketu Conjunction : శాస్త్రం ప్రకారం 55 సంవత్సరాల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోకి సంయోగం చెందబోతున్నాడు.తద్వారా, కన్యారాశిలోకి…
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్లో హీరోయిన్గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
This website uses cookies.