Taraka Ratna : నందమూరి తారకరత్న గుండెపోటుతో ఆసుపత్రికి చేరి రెండు వారాలు దాటింది. తారకరత్న ఆస్పత్రికి చేరి వారం రోజులు దాకా తన హెల్త్ గురించి అప్డేట్స్ కనిపిస్తుండేవి. తారకరత్న చికిత్స తీసుకుంటున్న బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ ను అఫీషియల్గా విడుదల చేసేవారు. కానీ గత పది రోజులుగా తారకరత్న హెల్త్ గురించి ఎటువంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు. దీంతో అభిమానులు తారక రత్న హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని కోరుకుంటున్నారు మొదట్లో నందమూరి ఫ్యామిలీ తారకరత్న విషయంలో ఎంతో హంగామా చేసి ఇప్పుడు అంత సైలెంట్ గా ఉండిపోయారు.
దీంతో తారకరత్నకు ఏమైందని, ఎందుకు అప్డేట్స్ ఇవ్వట్లేదని అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు తారకరత్నను చికిత్స కోసం విదేశాలకు పంపించాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం విదేశీ వైద్యులనే ఇక్కడికి రప్పించినట్లు సమాచారం. చికిత్సకు అవసరమైన సదుపాయాలన్నీ ఇక్కడ ఉన్న నేపథ్యంలో విదేశాల్లో పేరుపడ్డ వైద్య నిపుణులనే ఇక్కడికి రప్పించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో నందమూరి కుటుంబ వర్గాలు మీడియాకు సమాచారం ఇచ్చాయి.
గుండె, ఇతర అవయవాలు సాధారణ స్థితికి వచ్చినప్పటికీ మెదడు దెబ్బ తినడం తారకరత్నకు సమస్యగా మారినట్లు తెలుస్తోంది. దాదాపు తారకరత్న కోమస్థితికి దగ్గరగా వెళ్ళినట్టు తెలుస్తుంది. దీంతో బ్రెయిన్ రికవరీ చేసి సాధారణ స్థితికి తీసుకురావాలని వైద్యులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం విదేశీ వైద్యుల ఆధ్వర్యంలో శస్త్ర చికిత్స చేపిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో అభిమానులు తారక రత్న కోలుకొని ఆరోగ్యంతో తిరిగి ఇంటికి రావాలని కోరుకుంటున్నారు.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.