Those scenes were changed in Virupaksha
Virupaksha : సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ ‘ విరూపాక్ష ‘ బ్లాక్ బస్టర్ హిట్ ను దక్కించుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటించింది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా అత్యధిక వసూళ్లను రాబడుతు టాప్ ట్రేడింగ్ లో నిలిచింది. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాకి సుకుమార్ స్క్రీన్ ప్లే అందించాడు. అయితే ఇది కార్తీక్ దండు కి మొదటి సినిమా కాదట. 8 ఏళ్ల క్రితం దర్శకుడుగా మారి భం భోలేనాథ్ సినిమా తీశాడు. నవదీప్, నవీన్ చంద్ర హీరోలుగా నటించిన ఈ కామెడీ సినిమా నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది.
Those scenes were changed in Virupaksha
అలాగే నిఖిల్ కార్తికేయ సినిమాకి మూల కథ అందించారు. తాజాగా కార్తీక్ దండు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. భం బోలేనాథ్ సినిమాతో డైరెక్టర్ గా మారాను కానీ ఆ సినిమా కమర్షియల్ గా హిట్ కాలేదు. దాంతో విరూపాక్ష కథ రెడీ చేసుకున్నాను. సుకుమార్ దగ్గరికి వెళ్లి కథ వినిపించాను. ఆయనకు బాగా నచ్చడంతో స్క్రీన్ ప్లే అందిస్తానని చెప్పారు. అలాగే సినిమాలో కొన్ని మార్పులు చెప్పారు. సుకుమార్ సార్ ని కలిసిన 6, 7 సార్లు స్క్రీన్ ప్లే వర్షన్లను రాసుకున్నాం కానీ ప్రధాన కథనాన్ని మాత్రం ఎప్పుడూ మార్చలేదు.
క్లైమాక్స్ ఐడియా కూడా సుకుమార్ గారిదే. అది చాలా బాగా వర్క్ అవుట్ అయింది. క్లైమాక్స్ లో రివీల్ అయ్యే మెయిన్ విలన్ ని సుకుమార్ గారు మార్చేశారు. అలాగే సినిమాలో కనిపించిన కొన్ని యూనిక్ మర్డర్ సన్నివేశాలు సుకుమార్ గారే సూచించారు అని కార్తీక్ దండు చెప్పుకొచ్చారు. ఇక విరుపాక్ష బ్లాక్ బస్టర్ అవడంతో కార్తీక్ దండుకు వరుస ఆఫర్లు వస్తున్నాయట. నెక్స్ట్ సినిమాను కూడా థ్రిల్లర్ జోన్ లోనే తీయాలనుకుంటున్నాడట. మొదటి సినిమా చేసిన ఎనిమిదేళ్ల తర్వాత సినిమా చేసి హిట్టు కొట్టడం మామూలు విషయం కాదు. మొదటి సినిమా ఫ్లాప్ అయితే కొందరు ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళిపోతారు కానీ కార్తీక్ దండు అలా చేయకుండా ఇక్కడే ఉండి వచ్చాడు కాబట్టే ఈరోజు విరూపాక్ష లాంటి బ్లాక్ బస్టర్ హిట్ను అందుకున్నాడు.
New Villain : ఈ మధ్య సినీ పరిశ్రమకి కొత్త నటీనటులు పరిచయం అవుతున్నారు. కుబేర లో నటించిన విలన్…
Surveyor Tejeshwar : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సర్వేయర్గా పనిచేస్తున్న గంటా తేజేశ్వర్ హత్య కేసు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం…
Neelima : అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురానికి చెందిన బేతి వీర దుర్గా నీలిమ పై సోషల్ మీడియాలో “…
Neelima : రామచంద్రపురం పట్టణంలో ఒక మహిళ 12 పెళ్లిళ్లు చేసిన వార్త స్థానికంగా పెద్ద సంచలనంగా మారింది. నీలిమ…
8 Vasantalu Movie : తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 8 వసంతాలు. ఈ చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి…
Farmer : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు అనేక రకాలుగా అండగా నిలుస్తోంది. ముఖ్యంగా…
Daughter : తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణమైన హత్య సంచలనంగా మారింది. చాకలి ఐలమ్మ ముని మనవరాలు, ప్రజా ఉద్యమ…
Eating 2 Apples : ప్రతిరోజు కనీసం ఒకటి లేదా రెండు ఆపిల్ అయినా తినాలని డాక్టర్స్ సిఫారసు చేస్తూనే…
This website uses cookies.