Tollywood : బలిసి కొట్టుకుంటున్న ఆ నిర్మాతలు మాత్రమే మాట్లాడటం లేదు

 Authored By prabhas | The Telugu News | Updated on :13 January 2022,5:30 pm

Tollywood : టాలీవుడ్ నిర్మాతలు ఒక వైపు ఏపీ ప్రభుత్వం టిక్కెట్ల రేట్లు పెంచాలి అంటూ విజ్ఞప్తి చేస్తుంటే.. మరో వైపు ఏపీ అధికార పార్టీ నాయకులు మాత్రం సినిమా పరిశ్రమ పై విరుచుకు పడుతున్నారు. హైదరాబాద్లో ఉంటున్న తెలుగు సినిమా ప్రముఖులకు ఏపీ అనే ఒక రాష్ట్రం ఉందని… వారికి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి సీఎం అని తెలియదని అంటున్నారు. వారికి సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి చూపించడం కోసమే మేము ఈ పని చేస్తున్నట్లుగా కొందరు అనధికారికంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.తాజాగా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అందుకు నిదర్శనం అన్నట్లుగా ఉన్నాయి. తెలుగు సినిమాకు చెందిన నిర్మాతలు బలిసి కొట్టుకుంటున్నారు. వారు కనీసం సీఎం జగన్ మోహన్ రెడ్డి ని గుర్తించడం లేదు…

వారికి తగిన శాస్తి జరగాల్సిందే అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చేశాడు. బలిసి కొట్టుకుంటున్న వారు భారీ చిత్రాలు తీస్తున్నారని ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు పలువురు నిర్మాతలు స్పందించారు. అయితే ఇప్పటి వరకు స్పందించిన నిర్మాతల్లో పెద్ద నిర్మాతలు లేకపోవడం విశేషం. చిన్న నిర్మాతలు చాలా మంది అలాంటి వ్యాఖ్యలు తగదు అంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.పెద్ద ఎత్తున ఎమ్మెల్యే వ్యాఖ్యల విషయమై దుమారం రేపుతున్న నేపథ్యంలో టాలీవుడ్ లోని ఆ నలుగురు ఐదుగురు పెద్ద నిర్మాతలు ఎందుకు స్పందించడం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు ప్రశ్నిస్తున్నారు. నిజానికి బలిసి కొట్టుకుంటున్న వాళ్లు మాత్రం ఇప్పటి వరకు స్పందించడం లేదు.

Tollywood producers comments on mla prasanna kumar reddy

Tollywood producers comments on mla prasanna kumar reddy

Tollywood : ఆ పెద్ద నిర్మాతలు మాట్లాడరేం?

ఎవరి గురించి అయితే ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశాడో ఆ నిర్మాతలు మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలను టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరు కూడా మూకుమ్మడిగా ఖండించాల్సిన అవసరం ఉంది.ఇలాంటి వ్యాఖ్యలను ముందుముందు చిన్న పెద్ద నాయకులు మరిన్ని చేసే అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ విషయంలో వెంటనే ఆ పెద్ద నిర్మాతలు స్పందించాల్సిందిగా మీడియా వర్గాల వారు కూడా చర్చించుకుంటున్నారు. ఇప్పటికే వైకాపా ప్రభుత్వం సినిమా పరిశ్రమ కు వ్యతిరేకంగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేకు మరియు సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎక్కడ నష్టపోవాల్సి వస్తుందో అనే భయంతో ఎవరూ మాట్లాడటం లేదు అనేది టాక్‌ వినిపిస్తుంది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి