
trolled person is this one on Anasuya
Anasuya : బుల్లితెర ప్రముఖ యాంకర్ అనసూయ గురించి మనందరికి తెలిసిందే. అనసూయ ప్రస్తుతం సినిమాలతో బిజీగా మారగా, గత కొన్నిరోజులుగా ఆమెపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. ఆంటీ అనడంతో అనసూయ వారిపై కేసు కూడా పెట్టిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్స్తో ఆన్ లైన్ మాధ్యమాలను వేడెక్కించడం అనసూయ హాబీ కాగా, ఆ ఫొటోలతోనే కొందరు ట్రోల్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇటీవల లైగర్ రిలీజ్ అయినప్పుడు సినిమా బాలేదన్న టాక్ రావడంతో అనసూయ… కాస్త కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో అటు విజయ్ ఫ్యాన్స్తో పాటు.. కొందరు నెటిజన్లు కూడా అనసూయపై తీవ్ర విమర్శలు చేశారు.
సోషల్ మీడియాలో అనసూయని ట్రోల్ చేశారు. దాంతో చిర్రెత్తిపోయిన అనసూయ.. ఇక మీ అందరి పని పడతాను. అలా కామెంట్లు పెడుతున్న వాళ్లందరిపై పోలీస్ కంప్లైంట్ ఇస్తా అంటూ నేరుగా వార్నింగ్ కూడా ఇచ్చిన సంగతి మనందరికి తెలిసిందే. అయితే అనసూయ వ్యక్తిగత జీవితంపై అభ్యంతరకరమైన కామెంట్లు చేస్తున్న వ్యక్తిని పోలీసులు కనిపెట్టి అరెస్టు చేశారు. ఇన్ని రోజులు ఇవన్ని చేస్తున్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా పాసలపూడి గ్రామానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి పండరి రామ వెంకట వీర్రాజుగా పోలీసులు అతన్ని ఐడెంటిఫై చేశారు. గత కొంతకాలంగా అనసూయని సోషల్ మీడియాలో పండరి వేధిస్తూ వస్తున్నాడు. ఇన్ని రోజులు మొబైల్ ఫోన్లు మారుస్తూ పండరి పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు..
trolled person is this one on Anasuya
వారం రోజులు పాటు కోనసీమలో మకాం వేసిన పోలీసులు చిట్ట చివరకు పండరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరపరిచారు. ఇతను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, టెలిగ్రామ్ యాప్స్లో టాలీవుడ్ హీరోయిన్స్ ఫొటోస్ పెట్టి అసభ్యకరమైన రాతలు రాస్తున్నట్టు తేలింది. ఈనెల 17న సైబర్ క్రైమ్ పోలీసులకు యాంకర్ అనసూయ ఫిర్యాదు చేయగా, ఇతను “సాయి రవి 267” అనే ట్విట్టర్ అకౌంట్ ద్వారా హీరోయిన్స్ ఫొటోస్ పెడుతున్నాడు. నిందితుడు గతంలో మూడేళ్లపాటు దుబాయిలో ప్లంబర్ వర్క్ చేసినట్లుగా పోలీసులు కనుగొన్నారు. అనసూయ, విష్ణు ప్రియ, రష్మీ, ప్రగతి ఫోటోలతో పాటు మంత్రి రోజా ఫొటోలు కూడా ఇతను పోస్ట్ చేస్తున్నట్టు పోలీసులు కనుగొన్నారు.
Business : ప్రపంచంలో ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నప్పటికీ కొంతమంది ఎంచుకునే మార్గాలు సాధారణ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ వినియోగించే WhatsApp ఇప్పుడు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటివరకు పూర్తిగా…
Gold : ఇటీవలి కాలంలో డిజిటల్ గోల్డ్కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. స్మార్ట్ఫోన్ యాప్స్ అందుబాటులోకి రావడంతో బంగారాన్ని కొనుగోలు…
Mangoes : వేసవి కాలం అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది మామిడి పండు. సహజంగా తీపి రుచితో ఆకట్టుకునే ఈ…
Tea : ఉదయం నిద్రలేవగానే వేడి వేడి టీ కప్పు లేకపోతే చాలా మందికి రోజు మొదలవదనే చెప్పాలి. టీ…
Millet Breakfast : ఉదయం లేవగానే కొందరికి అలసట, నీరసం అనిపించడం సాధారణ విషయం. రాత్రి నిద్ర బాగా పడినా…
BPCL : ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి శుభవార్త అందింది. ప్రముఖ పబ్లిక్…
Aadhaar Card : భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ…
PM Modi : ఎన్నికల రాజకీయాల్లో అనుభవం కలిగిన ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన ప్రత్యేక శైలిని ప్రదర్శించారు.…
Samantha : అక్కినేని వారసుడు నాగచైతన్య, అగ్రనటి సమంత రూత్ ప్రభు ప్రేమకథ టాలీవుడ్లో ఒకప్పుడు హాట్ టాపిక్గా నిలిచింది.…
Airtel : టెలికాం రంగంలో మరోసారి ధరల పెంపు చర్చకు దారి తీసింది. ప్రముఖ టెలికాం సంస్థ Airtel తన…
CM Chandrababu : తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని పలు కీలక…
This website uses cookies.