Rashmika Mandanna : రష్మికా మందన్న తన ప్రియుడిని వదిలి వేయడనికి నేనే కారణం..!
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మికా మందన్న అతి తక్కువ సమయంలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన విషయం తెలిసిందే. నార్త్, సౌత్ మొత్తం తన గుప్పిట్లోకి తెచ్చుకుంటోంది. ఇప్పటికే తమిళంలో విజయ్ దళపతితో నటిస్తుండగా.. మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ దక్కించుకుందీ బ్యూటీ. ఈ అమ్మడు ‘పుష్ఫ : ది రైజ్’లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున సరసన నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత రష్మిక రేంజ్ మరో స్థాయికి చేరుకుంది. వరుసగా చిత్రాలను ప్రకటిస్తూ ఆశ్చర్యపరుస్తోంది. మరీముఖ్యంగా ఈ బ్యూటీ క్రమక్రమంగా బాలీవుడ్ ను తన గుప్పిట్లోకి తెచ్చుకుంటోంది. నార్త్ స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను అందిపుచ్చుకుంటోంది.
బాలీవుడ్ అగ్ర హీరోయిన్లకే మతిపోయేలా ఆఫర్లను అందుకుంటోంది. ఇప్పటికే హిందీలో ఈ బ్యూటీ నాలుగైదు చిత్రాల్లో నటిస్తున్నది. స్టార్ హీరోయిన్ గా రాజ్యమేలుతున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా.. తన నిశ్చితార్ధం క్యాన్సిల్ చేసుకోవడానికి కారణం నేనే అంటూ ప్రముఖ జోతిష్యుడు వేణు స్వామి సంచలన కామెంట్స్ చేశారు. మనకు తెలిసిందే.. రష్మిక సినిమాలోకి వచ్చే ముందే రక్షిత్ శెట్టి అనే అబ్బాయితో నిశ్చితార్ధం చేసుకుంది. కానీ, అనుకోని విధంగా ఆ ఎంగేజ్మెంట్ ని బ్రేకప్ చెప్పుతూ..అతని వదిలేసింది. అస్సలు వీళ్ళు ఎందుకు విడిపోయారా అనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. తాజాగా ప్రముఖ జోతిష్యుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. రీసెంట్ గా ఆయన ఓ ఇంటర్వ్యుల్లో మాట్లాడుతూ..”రష్మిక కి తన ప్రియుడు నుండి విడిపో మని చెప్పింది నేనే . ఎందుకంటే వాళ్ళ జాతకాలు కలవలేదు.

Rashmika Mandanna sensational comments on venu swamy
Rashmika Mandanna : వేణ స్వామి స్టన్నింగ్ కామెంట్స్..
ఇద్దరు పెళ్ళి చేసుకున్నా..డివర్స్ వరకు వెళ్తుంది. పైగా రష్మిక జాతకం చాలా బాగుంది. అమె ఖచ్చితంగా ఇండస్ట్రీని ఏలేసే హీరోయిన్ అవుతుంది అని నాకు తెలుసు..అందుకే చెప్పాను..”అంటూ బిగ్ బాంబ్ పేల్చారు. సమంత నాగ చైతన్య విడిపోతారని ముందే చెప్పిన ఆయన నయనతార జాతకంలోను.. విడాకులు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయని కూడా చెప్పారు. ప్రభాస్ జాతకంలోను పెళ్లి యోగం లేదన్నట్లే అని చెప్పుకొచ్చారు. చాలా మంది సెలబ్రిటీల విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వేణు స్వామి ఇప్పుడు రష్మిక విషయంలోను ఆసక్తికర కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆమె త్వరలో ఎంపీగా మారనుందంటూ కూడా వేణు స్వామి చెప్పుకొచ్చారు.