fans fight about rrr movie
RRR Movie : దర్శక ధీరుడు రాజమౌళి సంచలనాలు క్రియేట్ చేస్తున్నాడు. ఆయన ఒక సినిమాని మించి మరోటి అన్నట్టు చిత్రీకరిస్తున్నాడు. ఇప్పటికే బాహుబలితో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తుంది. రాజమౌళి ఈ పీరియాడిక్ డ్రామాకి దర్శకత్వం వహించగా ఎన్టీఆర్, రామ్ చరణ్ స్వాతంత్ర్య సమరయోధులు కొమరం భీమ్ మరియు అల్లూరి సీతారామరాజు పాత్రలను పోషించారు.స్వాతంత్ర్య సమరయోధులు నిజ జీవితంలో ఎప్పుడూ కలుసుకోనప్పటికీ, ఒక మిషన్ కోసం వారు ఎలా చేతులు కలిపారు అనే కల్పిత కథ.
కొమరం భీమ్ మరియు అల్లూరి సీతారామ రాజు స్వాతంత్ర్య పోరాటంలో చేరిన తర్వాత ఆర్ఆర్ఆర్ ముగుస్తుంది. అయితే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చిత్రానికి సీక్వెల్ని ప్లాన్ చేస్తున్నారని, ఆర్ఆర్ఆర్ సీక్వెల్పై ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేశారని తెలుస్తుండటం ఆసక్తికరంగా మారింది. తాజా సమాచారం ప్రకారం విజయేంద్రప్రసాద్ ఇప్పటికే “ఆర్.ఆర్.ఆర్” కోసం కథని రాయటం మొదలు పెట్టారట. ఒకవేళ ఆర్ ఆర్ ఆర్ సినిమా అనుకున్న స్థాయి లోనే బ్లాక్ బస్టర్ అయితే రాజమౌళి కచ్చితంగా ఈ సినిమాకి సీక్వెల్ తీయడానికి కూడా రెడీ అని తెలుస్తోంది.
vijayendra prasad plans sequal for rrr Movie
ఆర్ఆర్ఆర్ సినిమా కోసమే రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు మూడేళ్ల పాటు మరే సినిమా చేయకుండా కేవలం ఈ సినిమాపైనే దృష్టి పెట్టారు. మరి సీక్వెల్ కోసం మరొక రెండు మూడేళ్లు ఈ ఇద్దరు స్టార్ హీరోలు మరో రెండు మూడేళ్ల పాటు రాజమౌళికి ఇవ్వగలరా అని అభిమానులు సైతం ఆలోచనలో పడుతున్నారు. ఆర్ఆర్ఆర్ కనుకు బాహుబలిని మించి హిట్ అయితే దీనికి సీక్వెల్ చేసే ఆలోచన తప్పక వస్తుందని కొందరు విశ్లేషకులు అంటున్నారు. హీరోలు కూడా ఆసక్తి చూపడం ఖాయం అని చెబుతున్నారు. చూడాలి మరి రానున్న రోజులలో ఏం అద్భుతాలు జరుగుతాయో..!
Mahesh Babu : టాలీవుడ్లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…
This website uses cookies.