Home » Entertainment » Why Sudigali Sudheer Not Participating Etv Festival Special Shows
Entertainment

Sudigali Sudheer : పండగ స్పెషల్‌ కార్యక్రమాల్లో సుడిగాలి సుధీర్ కనిపించడం లేదు ఎందుకు?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: April 5, 2022 9:14 pm
Advertisement

Sudigali Sudheer : ఇంతకు ముందు కొత్త సంవత్సరం సందర్భంగా ఈటీవీ లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించే వారు. ఆ కార్యక్రమంను డిసెంబర్ 31 వ తారీకు అర్ధరాత్రి సమయం లో టెలికాస్ట్ చేసే వారు. ఆ కార్యక్రమానికి మంచి ఆదరణ వస్తున్న నేపథ్యం లో పెద్ద పండుగ లు అయిన సంక్రాంతి దసరా ఉగాది మూడు నాలుగు పండుగలకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించే వారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క చిన్న పండుగకు కూడా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు వారు మల్లెమాల మరియు ఈ టీవీ వారు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

Advertisement

హోలీ, శ్రీరామ నవమి ఇలా చిన్న పండుగలను కూడా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేస్తూ కార్యక్రమాలను నిర్వహిస్తున్న వారు ఎప్పటిలాగే ఈ టీవీ కి భారీగా రేటింగ్ ను తెచ్చి పెడుతున్నారు అనడంలో సందేహం లేదు. ఇప్పటికీ జబర్దస్త్ శ్రీదేవి కంపెనీ షో లతో ఈటివి కి మంచి రేటింగ్ దక్కుతుంది. ఈ సమయంలో పండగ స్పెషల్ కార్యక్రమాలు మరింత జోష్ నింపుతున్నాయి. ప్రతి పండుగకు ఏదో ఒక స్పెషల్ కార్యక్రమం వస్తుంది కానీ ఆ స్పెషల్ కార్యక్రమంలో సుడిగాలి సుదీర్ కనిపించకపోవడం చాలా పెద్ద లోటుగా చర్చించుకుంటున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ యాంకర్గా వ్యవహరిస్తున్న సుధీర్‌ ఇతర కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నాడు అనేది తెలియడం లేదు.

why sudigali sudheer not participating etv festival special shows

Advertisement

ఈ టీవీలో ప్రసారం అవుతున్న ఇతర కార్యక్రమాల్లో… ప్రత్యేక కార్యక్రమాల్లో సుధీర్ హాజరు కాకపోవడం వెనక పెద్ద ఉద్దేశం ఏదైనా ఉందా లేదంటే ఆయన కేవలం ఇతర షూటింగ్‌ ల కారణంగానే హాజరు కావడం లేదా అంటూ ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు. యూట్యూబ్ లో ఇతర పండగ స్పెషల్ కార్యక్రమాలు ఏవి కూడా సుధీర్ లేకుండా వస్తే వాటికి సుధీర్ అభిమానులు ఓ రేంజ్ లో కామెంట్స్ పెడుతున్నారు. సుధీర్ లేకుండా ఈటీవీ వారు చేసిన ఈ కార్యక్రమం ను ఒక చెత్త కార్యక్రమం అంటూ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సుధీర్‌ మరి ఎందుకు ఈ స్పెషల్ కార్యక్రమాల్లో ఉండడం లేదు అనేది ఆయన అభిమానులకు సమాధానం లేని ప్రశ్నగా మారింది. సుధీర్‌ ను మల్లెమాల వారు తగ్గిస్తున్నారేమో అనేది కొందరి అభిప్రాయం. మరి ఈ విషయానికి సుడిగాలి సుధీర్‌ సమాధానం చెప్తాడు అనేది చూడాలి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి