Yellamma Movie : రంగ్ దే కాంబో రిపీట్ చేస్తున్న జ‌బ‌ర్ధ‌స్త్ వేణు.. ఎల్ల‌మ్మ‌పై భారీ అంచ‌నాలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Yellamma Movie : రంగ్ దే కాంబో రిపీట్ చేస్తున్న జ‌బ‌ర్ధ‌స్త్ వేణు.. ఎల్ల‌మ్మ‌పై భారీ అంచ‌నాలు..!

 Authored By ramu | The Telugu News | Updated on :20 April 2025,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Yellamma Movie : రంగ్ దే కాంబో రిపీట్ చేస్తున్న జ‌బ‌ర్ధ‌స్త్ వేణు.. ఎల్ల‌మ్మ‌పై భారీ అంచ‌నాలు..!

Yellamma Movie : ‘బలగం’ తో బ్లాక్‌బస్టర్ అందుకోవడమే కాకుండా ఎంతో పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న వేణు యెల్దండి ప్ర‌స్తుతం త‌న రెండో సినిమాపై దృష్టి పెట్టాడు. కీర్తి సురేష్‌, , నితిన్ కాంబినేషన్లో ‘ఎల్లమ్మ’ పేరుతో ఓ సినిమా తెరకెక్కించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.. ఇందులో మొదలగా సాయిపల్లవిని అనుకున్న యూనిట్ ఆమెను సంప్రదించింది. అయితే కాల్‌షీట్స్ సమస్యతో ఆమె ఈ ప్రాజెక్టు చేయలేనని చెప్పినట్లు సమాచారం.

Yellamma Movie రంగ్ దే కాంబో రిపీట్ చేస్తున్న జ‌బ‌ర్ధ‌స్త్ వేణు ఎల్ల‌మ్మ‌పై భారీ అంచ‌నాలు

Yellamma Movie : రంగ్ దే కాంబో రిపీట్ చేస్తున్న జ‌బ‌ర్ధ‌స్త్ వేణు.. ఎల్ల‌మ్మ‌పై భారీ అంచ‌నాలు..!

Yellamma Movie : కాంబినేష‌న్ సెట్..

దీంతో హీరోయిన్ కోసం మళ్లీ సెర్చింగ్ మొదలుపెట్టిన వేణు కీర్తి సురేష్ అయితే బాగుంటుందని అనుకున్నాడట. ఇప్పటికే ఆమెను కలిసి ‘ఎల్లమ్మ’ చెప్పాడని టాక్. ఈ ప్రాజెక్టుకు కీర్తి సురేష్ త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. నితిన్-కీర్తి సురేష్ కాంబోలో ఇది రెండో సినిమా అవుతుంది. గతంలో వీరిద్దరు ‘రంగ్ దే’ మూవీలో కలిసి నటించారు. నితిన్, శ్రీలీల జంటగా నటించిన ‘రాబిన్ హుడ్’ మూవీ ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు రాగా, నిరాశ‌ప‌రిచింది.

ఇక ఈ చిత్రానికి అజ‌య్- అతుల్ సంగీతం అందించ‌నున్నార‌ని స‌మాచారం. రూర‌ల్ డ్రామాగా రూపొంద‌నున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. తొలి సినిమాతో మంచి హిట్ కొట్టిన వేణు రెండో సినిమాతోను అద‌ర‌గొట్ట‌బోతున్నాడ‌ని స‌మాచారం.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది