ap deputy cm narayana swamy comments go viral
AP Politics : ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎందుకంటే.. ఎన్నికలకు ఇంకా ఒక్క సంవత్సరం మాత్రమే సమయం ఉంది. అందుకే రోజురోజుకూ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలు తూటాలుగా పేలుతున్నాయి. మాటల యుద్ధమే నడుస్తోంది వాళ్ల మధ్య. ఎన్నికలకు ఇంకా సంవత్సరం సమయం ఉంది కానీ.. ఇప్పటి నుంచే ఎన్నికలకు పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి.
ముఖ్యంగా ఇక్కడ యుద్ధం అనేది వైసీపీ ప్రభుత్వానికి, ప్రతిపక్ష టీడీపీ పార్టీ మధ్య. ఏపీకి సంబంధించి ఇటీవలే టీడీపీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. అప్పటి నుంచి ఆ వార్ ఇంకాస్త ముదిరింది అనే చెప్పుకోవాలి. దానికి కారణం.. మేనిఫెస్టోనే. ఎందుకంటే.. మేనిఫెస్టోను ప్రకటించిన చంద్రబాబు.. మొత్తం వైసీపీ ప్రభుత్వం పథకాలను కాపీ కొట్టారని అంటున్నారు. దీంతో వీళ్ల యుద్ధం మరింత రెచ్చిపోయినట్టయింది. తాజాగా చంద్రబాబుపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మండిపడ్డారు.ప్రస్తుతం ఏపీలో దేవుడికి, రాక్షసులకు మధ్య యుద్దం జరుగుతోందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి వ్యాఖ్యానించారు. దేవుడి పక్షాన జగన్ ఉద్యోగం చేస్తుండగా, రాక్షసుల పక్షాన చంద్రబాబు యుద్ధం చేస్తున్నారు. సీఎం జగన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అన్ని వర్గాల శ్రేయస్సు కోసం పనిచేస్తున్నారు.
ap deputy cm narayana swamy comments go viral
రైతుల కోసం ఆయన పని చేస్తున్నారు. రైతులకు మద్దతు ధర కల్పించడం కోసం పని చేస్తుంటే.. చంద్రబాబు మాత్రం పదవి దాహంతో కొట్టుకుంటున్నారు. ఆయనకు పదవి దాహం తప్ప మరో దాహం లేదు.. అంటూ నారాయణ స్వామి ధ్వజమెత్తారు. చంద్రబాబు మేనిఫెస్టోను అసలు ప్రజలు పట్టించుకుంటున్నారా? ఆయన మేనిఫెస్టోల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గెలిచేంత వరకే మేనిఫెస్టోల గురించి. ఆ తర్వాత ఆయన మేనిఫెస్టోలనే పట్టించుకోరు. అందుకే ఔరంగజేబుకు, చంద్రబాబుకు మధ్య ఎలాంటి తేడా లేదు.. అంటూ చంద్రబాబుపై నారాయణస్వామి విమర్శనాస్త్రం సంధించారు.
Kannappa Movie Review : తెలుగు చిత్ర పరిశ్రమలో Kannappa Review పాపులర్ ప్రొడక్షన్ హౌస్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ,…
kannappa Movie : మంచు విష్ణు భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన కన్నప్ప సినిమా రేపు గ్రాండ్గా విడుదల కానుంది.…
Ram charan : గ్లోబల్ స్టార్ రామ్చరణ్ కుడి చేయికి గాయం అయినట్లు వార్తలు వెలుగుచూస్తున్నాయి. బుధవారం హైదరాబాద్లోని శిల్పకళా…
Subhanshu Shukla : భారత అంతరిక్ష చరిత్రలో మరొక సువర్ణాధ్యాయం లిఖితమైంది. యాక్సియం-4 (Axiom-4) మిషన్లో భాగంగా భారతీయుడు శుభాంశు…
Father : ఆస్తుల కోసం తల్లిదండ్రులను వేధించే ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా పడవేడు గ్రామానికి చెందిన…
Daughter : హైదరాబాద్ జీడిమెట్లలో జరిగిన ఓ హృదయవిదారక ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ప్రేమకు అడ్డుగా మారిందనే కారణంతో పదో…
Phone Tapping Case : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు మొదట చిన్న ఉదంతంలా కనిపించినా, ఇప్పుడది పెద్ద స్థాయిలో…
Heroine : చాలా మంది హీరోయిన్స్ సినిమాలతో పాటు బిజినెస్ లతోనూ కోట్లు సంపాదిస్తున్నారు. అలా సంపాదించిన డబ్బుతో కాస్ట్లీ…
This website uses cookies.