Nagarjuna Sagar by Elections : నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇప్పటికే కాంగ్రెస్ మరియు బీజేపీ లు తమ అభ్యర్థలను ప్రకటించి ప్రచారంతో దూసుకు పోతున్నారు. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున క్యాపెంయిన్ చేస్తున్న విషయం తెల్సిందే. టీఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు అభ్యర్థి ఎవరు అనే విషయాన్ని తెలియకుండానే ప్రచారంను జోరుగా చేస్తున్నారు. ప్రభుత్వం చేసిన మంచి పనులను ఏకరువు పెడుతూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఆ స్థానంలో నోముల నర్సింగయ్య గత ఎన్నికల్లో పోటీ చేసి జానారెడ్డిపై గెలిచాడు. ఇప్పుడు ఆయన తనయుడు కూడా ఆ స్థానంలో పోటీ చేసి గెలుపు సాధిస్తాను అనే నమ్మకంతో ఉన్నాడు. కాని పార్టీ అధినాయకత్వం మాత్రం నర్సింగయ్య తనయుడు నోముల భరత్ కు టికెట్ ను ఇచ్చేందుకు సిద్దంగా లేదు.
రెడ్డి సామాజిక వర్గంకు చెందిన జానా రెడ్డి పై పోటీగా బీసీ కి చెందిన నాయకుడిని రంగంలోకి దించడం వల్ల ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుందని కేసీఆర్ రాజకీయ సన్నిహితులు సూచించినట్లుగా తెలుస్తోంది. దుబ్బక ఎన్నికల్లో సెంటిమెంట్ పేరుతో చనిపోయిన ఎమ్మెల్యే భార్యకు సీటు ఇస్తే అక్కడ పార్టీ పరువు పోయినంత పనైంది. ఆ ఒక్క ఓటమితో టీఆర్ఎస్ ఇంకా కూడా కుదుపుకు గురి అవుతూనే ఉంది. అందుకే ఈ సమయంలో ఆ సెంటిమెంట్ పేరుతో ఆ స్థానంను చేజార్చుకోవద్దు అనే ఉద్దేశ్యంతో కేసీఆర్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. అందుకే బీసీ సామాజిక వర్గంకు చెందిన కట్టబోయిన గురువయ్య యాదవ్ ను రంగంలోకి దించబోతున్నాడు.
సాగర్ ఉప ఎన్నిక కోసం అభ్యర్థిని ఎంపిక చేసేందుకు నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. పదుల సంఖ్యలో నాయకులు ఆ స్థానం నుండి పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నట్లుగా ముందుకు వచ్చారు. వచ్చిన వారందరిలోకి గ్రౌండ్ లెవల్ లో ఎక్కువ ప్రజాధరణ ఉన్న నాయకుడిగా గురువయ్య యాదవ్ పేరు సర్వేలో వచ్చినట్లుగా రాజకీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మరేదైనా రాజకీయ సమీకరణలు మారితే తప్ప సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసేది గురువయ్య యాదవ్ మాత్రమే అంటూ ఆ పార్టీ నాయకులు అంటున్నారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.