KCR
Nagarjuna Sagar by Elections : నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇప్పటికే కాంగ్రెస్ మరియు బీజేపీ లు తమ అభ్యర్థలను ప్రకటించి ప్రచారంతో దూసుకు పోతున్నారు. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున క్యాపెంయిన్ చేస్తున్న విషయం తెల్సిందే. టీఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు అభ్యర్థి ఎవరు అనే విషయాన్ని తెలియకుండానే ప్రచారంను జోరుగా చేస్తున్నారు. ప్రభుత్వం చేసిన మంచి పనులను ఏకరువు పెడుతూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఆ స్థానంలో నోముల నర్సింగయ్య గత ఎన్నికల్లో పోటీ చేసి జానారెడ్డిపై గెలిచాడు. ఇప్పుడు ఆయన తనయుడు కూడా ఆ స్థానంలో పోటీ చేసి గెలుపు సాధిస్తాను అనే నమ్మకంతో ఉన్నాడు. కాని పార్టీ అధినాయకత్వం మాత్రం నర్సింగయ్య తనయుడు నోముల భరత్ కు టికెట్ ను ఇచ్చేందుకు సిద్దంగా లేదు.
రెడ్డి సామాజిక వర్గంకు చెందిన జానా రెడ్డి పై పోటీగా బీసీ కి చెందిన నాయకుడిని రంగంలోకి దించడం వల్ల ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుందని కేసీఆర్ రాజకీయ సన్నిహితులు సూచించినట్లుగా తెలుస్తోంది. దుబ్బక ఎన్నికల్లో సెంటిమెంట్ పేరుతో చనిపోయిన ఎమ్మెల్యే భార్యకు సీటు ఇస్తే అక్కడ పార్టీ పరువు పోయినంత పనైంది. ఆ ఒక్క ఓటమితో టీఆర్ఎస్ ఇంకా కూడా కుదుపుకు గురి అవుతూనే ఉంది. అందుకే ఈ సమయంలో ఆ సెంటిమెంట్ పేరుతో ఆ స్థానంను చేజార్చుకోవద్దు అనే ఉద్దేశ్యంతో కేసీఆర్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. అందుకే బీసీ సామాజిక వర్గంకు చెందిన కట్టబోయిన గురువయ్య యాదవ్ ను రంగంలోకి దించబోతున్నాడు.
Telangana CM KCR
సాగర్ ఉప ఎన్నిక కోసం అభ్యర్థిని ఎంపిక చేసేందుకు నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. పదుల సంఖ్యలో నాయకులు ఆ స్థానం నుండి పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నట్లుగా ముందుకు వచ్చారు. వచ్చిన వారందరిలోకి గ్రౌండ్ లెవల్ లో ఎక్కువ ప్రజాధరణ ఉన్న నాయకుడిగా గురువయ్య యాదవ్ పేరు సర్వేలో వచ్చినట్లుగా రాజకీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మరేదైనా రాజకీయ సమీకరణలు మారితే తప్ప సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసేది గురువయ్య యాదవ్ మాత్రమే అంటూ ఆ పార్టీ నాయకులు అంటున్నారు.
GPO Posts : రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పాలనాధికారి (జీపీవో) పోస్టులన్నింటినీ నేరుగా భర్తీ చేయాలని ఆలోచనలో ఉంది. గతంలో…
Janhvi Kapoor : టాలీవుడ్లో జాన్వీ కపూర్ మరింత బిజీ అవుతోంది. 2018లో 'ధడక్' సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన…
Fathers Death : ఏ తండ్రికైనా తన కొడుకును పెళ్లి మండపంలో చూడాలని, మనవాళ్ళు , మానవరాళ్లతో ఆటలు ఆడుకోవాలని…
Chennai Super Kings : ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కనబరుస్తుంది. ఆ జట్టు…
Virat Kohli : ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ నుంచి ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒక్కడే…
Google Pay Phonepe : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏ పేమెంట్ చేయాలన్నా దాదాపు యూపీఐ పేమెంట్స్…
Alcohol :ప్రస్తుత కాలంలో మద్యానికి బానిసైన వారి సంఖ్య ఎక్కువే. ఒకసారి మద్యాన్ని తాగడానికి అలవాటు పడితే జీవితంలో దాన్ని…
Chanakyaniti : చానిక్యుడు తన నీతి కథలలో మనవాలి జీవితాన్ని గురించి అనేక విషయాలను అందించాడు, కౌటిల్యు నీ పేరుతో…
This website uses cookies.