Prawns : చేపల ప్రియులకు శుభవార్త… అతి తక్కువ ధరకే రొయ్యలు…!

Advertisement
Advertisement

Prawns : విశాఖ ఫిషింగ్ హార్బర్ లో తాజా రొయ్యలు మరియు చేపలు దర్శనం ఇస్తున్నాయి. సుమారుగా రెండు నెలల గ్రామం తరువాత విశాఖ సముద్ర జలల్లోకి ఫిషింగ్ బోర్డులో వేటకు బయలు దేరాయి. అయితే 60 రోజులపాటు చేపల వేటకు ప్రతి సంవత్సరం కూడా విరామం అనేది ప్రకటించడం జరుగుతుంది. అంతేకాక ఏ ఒక్కరు కూడా విరామం టైంలో వేటకు వెళ్ళవద్దు అని ప్రభుత్వాలు ఆదేశాలు ఇవ్వడంతో మత్స్య సంపద మొత్తం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఈ టైంలో సముద్రంలో రొయ్యలు మరియు చేపలు చాలా బాగా పెరుగుతాయి. ఈనెల 15వ తారీకు అర్ధరాత్రి నుండి మత్స్యకారులు తిరిగి తమ వేటను మొదలుపెట్టారు. అయితే మొదటగా రొయ్యల వేట పైనే మత్స్యకారులు ఎక్కువగా దృష్టి పెట్టారు. నాలుగు రోజుల నుండి చేపల వేటకు వెళ్లే వారికి పింక్ బ్రౌన్ రొయ్యలు ఎక్కువగా దొరుకుతున్నాయి. దీని ఖరీదు వచ్చేసి మార్కెట్లో కేజీ రూ.200 వరకు ఉంది అని మత్స్యకారుల నాయకుడు ఆనంద్ తెలిపారు. హెర్బర్ కొచ్చి చాపల ప్రియులకు ఇది మంచి శుభవార్త అని చెప్పొచ్చు. అయితే స్థానిక అమ్మకాలు కాక పింకు బ్రౌన్ రొయ్యలకు విదేశాలలో ఎంతో డిమాండ్ ఉన్నది.

Advertisement

దీనిలో యూకే, యూరప్, ఆస్ట్రేలియా లాంటి దేశాలలో పింక్ బ్రౌన్ రొయ్యలను ఎంతో ఇష్టంగా తింటారు. అక్కడ వీటి ధర వచ్చేసి ఎంతో ఎక్కువగా ఉంటుంది అని మత్స్యకారులు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఎగుమతి అనేది ఎక్కువగా లేకపోవడం వలన ఇక్కడ సరుకు అధికంగా ఉండటం వలన ధర తగ్గింది అని అంటున్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ కు దగ్గరలో ఉన్న నగరవాసులకు తక్కువ ధరకే రొయ్యలు ఇస్తున్నామని మత్స్యకారుల నాయకుడు ఆనంద్ తెలిపారు… మొదట్లో రొయ్యలే ఎక్కువగా లభిస్తాయి అని వీరు తెలిపారు. వేట విరామం తర్వాత మత్స్యకారులకు మత్స్య సంపద ఎక్కువగా లభించటంతో కొంతవరకు ఊరట చెందారు. విశాఖ ఫిషింగ్ హెర్బర్ నుండి ఒడిశా మరియు శ్రీలంక సరిహద్దుల వరకు కూడా కేంద్ర ప్రభుత్వం నిబంధనలను అనుసరించి వీరు వేట అనేది కొనసాగిస్తారు. అయితే వీరు సరిహద్దులు దాటకూడదు అనే స్పష్టమైన ప్రభుత్వ ఆదేశాలు కూడా ఉన్నాయి.

Advertisement

Prawns : చేపల ప్రియులకు శుభవార్త… అతి తక్కువ ధరకే రొయ్యలు…!

ప్రభుత్వ నియమం ప్రకారం మత్యకారులు తమ వేట కొనసాగించాలి. అయితే వేట విరామం టైంలో ప్రతి ఒక్కరి మత్స్యకారుడికి కూడా ప్రభుత్వం పదివేల రూపాయలను చెల్లిస్తుంది. కానీ ఎన్నికల కోడ్, కొత్త ప్రభుత్వ వచ్చిన తరుణంలో ఒక్క విశాఖపట్నం ప్రాంతాలలో మాత్రమే సుమారుగా 13 వేల మంది మత్స్యకారులకు వేట విరామం కరువు బత్యం చెల్లించాల్సి ఉంది అని మత్స్యకారుల నాయకుడు ఆనంద్ తెలిపారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు ఈ భత్యాన్ని చెల్లించాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు…

Advertisement

Recent Posts

Raviteja : విలన్ పాత్రలకు రెడీ అంటున్న మాస్ రాజా..!

Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస…

3 hours ago

Electric Vehicles : ఎలక్ట్రిక్ వాహనాల కోసం PM E-డ్రైవ్ పథకం ప్రారంభం..!

Electric Vehicles : భారత ప్రభుత్వం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్‌హాన్స్‌మెంట్ (PM E-డ్రైవ్)…

4 hours ago

TGSRTC : జాబ్ నోటిఫికేషన్.. నెలకు 50 వేల జీతంతో ఉద్యోగాలు..!

TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు…

5 hours ago

Jr NTR : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఎన్టీఆర్ కలుస్తున్నాడు..!

Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు.…

6 hours ago

Ganesh Nimajjanam : గణేష్ నిమజ్జనాలు.. పోలీసుల కీలక రూల్స్ ఇవీ.. పాటించకపోతే అంతే సంగతులు..!

Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో…

7 hours ago

Revanth Reddy : కేసీఆర్ లక్కీ నంబర్ నా దగ్గర ఉంది.. నన్నేం చేయలేరన్న రేవంత్ రెడ్డి..!

Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది.…

8 hours ago

Shekar Basha : బిగ్ బాస్ నుండి అనూహ్యంగా శేఖ‌ర్ భాషా బ‌య‌ట‌కు రావ‌డానికి కార‌ణం ఇదేనా?

Shekar Basha : బిగ్‌బాస్ తెలుగు 8 స‌క్సెస్ ఫుల్‌గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్…

9 hours ago

Liquor : మందు బాబుల‌కి కిక్కే కిక్కు.. ఇక రానున్న రోజుల‌లో ర‌చ్చ మాములుగా ఉండ‌దు..!

Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో…

10 hours ago

This website uses cookies.