
Prawns : చేపల ప్రియులకు శుభవార్త... అతి తక్కువ ధరకే రొయ్యలు...!
Prawns : విశాఖ ఫిషింగ్ హార్బర్ లో తాజా రొయ్యలు మరియు చేపలు దర్శనం ఇస్తున్నాయి. సుమారుగా రెండు నెలల గ్రామం తరువాత విశాఖ సముద్ర జలల్లోకి ఫిషింగ్ బోర్డులో వేటకు బయలు దేరాయి. అయితే 60 రోజులపాటు చేపల వేటకు ప్రతి సంవత్సరం కూడా విరామం అనేది ప్రకటించడం జరుగుతుంది. అంతేకాక ఏ ఒక్కరు కూడా విరామం టైంలో వేటకు వెళ్ళవద్దు అని ప్రభుత్వాలు ఆదేశాలు ఇవ్వడంతో మత్స్య సంపద మొత్తం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఈ టైంలో సముద్రంలో రొయ్యలు మరియు చేపలు చాలా బాగా పెరుగుతాయి. ఈనెల 15వ తారీకు అర్ధరాత్రి నుండి మత్స్యకారులు తిరిగి తమ వేటను మొదలుపెట్టారు. అయితే మొదటగా రొయ్యల వేట పైనే మత్స్యకారులు ఎక్కువగా దృష్టి పెట్టారు. నాలుగు రోజుల నుండి చేపల వేటకు వెళ్లే వారికి పింక్ బ్రౌన్ రొయ్యలు ఎక్కువగా దొరుకుతున్నాయి. దీని ఖరీదు వచ్చేసి మార్కెట్లో కేజీ రూ.200 వరకు ఉంది అని మత్స్యకారుల నాయకుడు ఆనంద్ తెలిపారు. హెర్బర్ కొచ్చి చాపల ప్రియులకు ఇది మంచి శుభవార్త అని చెప్పొచ్చు. అయితే స్థానిక అమ్మకాలు కాక పింకు బ్రౌన్ రొయ్యలకు విదేశాలలో ఎంతో డిమాండ్ ఉన్నది.
దీనిలో యూకే, యూరప్, ఆస్ట్రేలియా లాంటి దేశాలలో పింక్ బ్రౌన్ రొయ్యలను ఎంతో ఇష్టంగా తింటారు. అక్కడ వీటి ధర వచ్చేసి ఎంతో ఎక్కువగా ఉంటుంది అని మత్స్యకారులు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఎగుమతి అనేది ఎక్కువగా లేకపోవడం వలన ఇక్కడ సరుకు అధికంగా ఉండటం వలన ధర తగ్గింది అని అంటున్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ కు దగ్గరలో ఉన్న నగరవాసులకు తక్కువ ధరకే రొయ్యలు ఇస్తున్నామని మత్స్యకారుల నాయకుడు ఆనంద్ తెలిపారు… మొదట్లో రొయ్యలే ఎక్కువగా లభిస్తాయి అని వీరు తెలిపారు. వేట విరామం తర్వాత మత్స్యకారులకు మత్స్య సంపద ఎక్కువగా లభించటంతో కొంతవరకు ఊరట చెందారు. విశాఖ ఫిషింగ్ హెర్బర్ నుండి ఒడిశా మరియు శ్రీలంక సరిహద్దుల వరకు కూడా కేంద్ర ప్రభుత్వం నిబంధనలను అనుసరించి వీరు వేట అనేది కొనసాగిస్తారు. అయితే వీరు సరిహద్దులు దాటకూడదు అనే స్పష్టమైన ప్రభుత్వ ఆదేశాలు కూడా ఉన్నాయి.
Prawns : చేపల ప్రియులకు శుభవార్త… అతి తక్కువ ధరకే రొయ్యలు…!
ప్రభుత్వ నియమం ప్రకారం మత్యకారులు తమ వేట కొనసాగించాలి. అయితే వేట విరామం టైంలో ప్రతి ఒక్కరి మత్స్యకారుడికి కూడా ప్రభుత్వం పదివేల రూపాయలను చెల్లిస్తుంది. కానీ ఎన్నికల కోడ్, కొత్త ప్రభుత్వ వచ్చిన తరుణంలో ఒక్క విశాఖపట్నం ప్రాంతాలలో మాత్రమే సుమారుగా 13 వేల మంది మత్స్యకారులకు వేట విరామం కరువు బత్యం చెల్లించాల్సి ఉంది అని మత్స్యకారుల నాయకుడు ఆనంద్ తెలిపారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు ఈ భత్యాన్ని చెల్లించాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు…
Vijay-Rashmika : టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ – నటి రష్మిక దంపతులు ఇవాళ దేశ ప్రధాన మంత్రి…
Rinku Singh Father Death: భారత క్రికెట్ జట్టు యువ సంచలనం, స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ Rinku Singh…
Delhi liquor case : దేశ రాజకీయాల్లో కలకలం రేపిన లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆమ్…
Medchal : శతమానం భవతి అని కుటుంబ సభ్యులు ఆశీర్వదిస్తూ నిండునూరేళ్లు పూర్తి చేసుకున్న వృద్ధుడికి ఘనంగా శతాబ్ది వేడుకలు…
MODI Geo politics : ప్రస్తుతం అరబ్ దేశాల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, యునైటెడ్…
Revanth Reddy : రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేసేందుకు సిద్ధమైంది. రాబోయే 2026-27…
Gold Silver Rate Today 27 Feb 2026 : పసిడి ప్రేమికులకు ఇది నిజంగా అదిరే శుభవార్త అని…
Uttutta Herolu Movie Review and Rating : తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్లు హీరోలుగా మారి సక్సెస్ సాధించడం…
Karthika Deepam 2 Today 27 Feb 2026 : స్టార్ మాలో ప్రసారం అవుతున్న 'కార్తీక దీపం 2'…
Dosha : ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపే వారు తరచూ ఒకే రకమైన అల్పాహారం తీసుకుంటూ విసుగు చెందుతుంటారు. ముఖ్యంగా…
Weight Loss : ఇటీవలి కాలంలో చాయ్, కాఫీలకు బదులుగా గ్రీన్ టీకి ప్రజలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆరోగ్యంపై…
Chanakya Neeti : ప్రతి సమాజం సక్రమంగా నడవాలంటే బాధ్యతలు నిర్వర్తించే వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా కీలక బాధ్యతల్లో…
This website uses cookies.