Home » Health » Diabetics Should Not Go For These Fruit Juices
Health

Diabetics : షుగర్ పేషెంట్లు ఈ పండ్ల జ్యూస్ ల జోలికి పోవద్దు… ఎందుకంటే…?

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: February 21, 2025 11:15 pm
Advertisement

Diabetics  : ఇప్పుడు ప్రస్తుతం డయాబెటిస్ రోగుల సంఖ్య నానాటికి పెరగడం గమనిస్తూనే ఉన్నాం. వయసుతో ఎటువంటి సంబంధం లేకుండా షుగర్ అందరికీ ఎటాక్ అవుతుంది. అయితే షుగర్ వచ్చిన తర్వాత ఆహారం పట్ల చాలా జాగ్రత్తగా వహించాలి. తద్వారా రక్తంలోని చక్కర స్థాయిలు పెరగకుండా నిరోధించుకోవచ్చు. ఈరోజుల్లో చాలామంది కూడా జ్యూస్లను తాగడానికి ఏమాత్రం ఇష్టపడరు. అయితే డయాబెటిస్ రోగులు మాత్రం పండరసాలను తాగొచ్చా… అసలు నిపుణులు ఏం చెబుతున్నారు… వీటి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు కాలంలో షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. పరిస్థితుల్లో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి. మంచి ఆహార పదార్థాలను ఈ శ్రద్ధగా తీసుకోవాలి. డయాబెటిస్ పేషెంట్లు తాము రోజు తినే ఆహారం పై శ్రద్ధ పెట్టాలి. అంటే రక్తంలో చక్కర స్థాయిల పరిమాణం పెరిగి ఆరోగ్యం బాగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి యొక్క నిర్వహణ.. ఆహారం.. జీవనశైలి పై చాలా ఆధారపడి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు డయాబెటిస్ రోగులు అయితే, మీరు ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలను మాత్రమే తీసుకోవాలి. షుగర్ పేషెంట్లు ఆకుకూరలు, పండ్లు తినమని వైద్యులు సలహా ఇచ్చినప్పటికీ. ఈ మధుమేహ రోగులు జ్యూసులు తాగకుండా ఉండాలి. ఎందుకంటే పండ్ల రసాలలోను లేదా పండ్లను అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. జ్యూసులు తాగితే చక్కెర స్థాయిలో వేగంగా పెరుగుతాయి. అయితే ఈ షుగర్ పేషెంట్లు జ్యూసులు తాగవచ్చా లేదా అనే విషయంపై ఢిల్లీలోని సీనియర్ వైద్యుడు అయిన డాక్టర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ… షుగర్ పేషెంట్లు కొన్ని పండ్ల రసాలను తాగకుండా ఉండాలని తెలియజేశారు.

Advertisement

Diabetics : షుగర్ పేషెంట్లు ఈ పండ్ల జ్యూస్ ల జోలికి పోవద్దు… ఎందుకంటే…?

Diabetics  నారింజ

ఈ నారింజలో చక్కెరల స్థాయిలో ఎక్కువగా ఉంటాయి. ఇది ఉదయం నారింజ రసం తాగితే చక్కర స్థాయిలు కూడా అధికంగా పెరుగుతాయి. అదే సమయంలో కూడా మీరు ఒక్క నారింజ పండ్లు పూర్తిగా తింటే చాలు అందులో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. తద్వారా దాని రసం తాగే బదులు మొత్తం నారింజపండును తింటే మంచిది. జ్యూసులు కన్నా పండును నేరుగా తింటేనే మంచి ఫలితాలు ఉంటాయి.

Advertisement

పైనాపిల్ : పైనాపిల్ లో చెక్కర్ల స్థాయి ఎక్కువగా మొత్తంలో ఉంటుంది. దీంతో పాటు దాని లైసెన్స్ సూచిక కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇది రక్తంలో చక్కెరను వేగవంతం చేస్తుంది. కాబట్టి పైనాపిల్ పూర్తిగా తినడం మరింత ప్రయోజనకరం. ఇటువంటి పరిస్థితుల మీరు పైనాపిల్ ని మామూలుగా తింటే మీకు ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి కానీ జ్యూస్ లాగా తాగితే, లో చెక్కర స్థాయిలో విపరీతంగా పెరుగుతాయి. ఈ పైనాపిల్ను కూడా నేరుగా తింటేనే ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

ఆపిల్ : ఆపిల్ ని తింటే అనేక వ్యాధులు నయమవుతాయని అంటుంటారు. పిలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది కానీ దాన్ని పూర్తిగా తినడం ఆరోగ్యానికి మేలే. అని దీన్ని జ్యూసు లాగా తాగితే మాత్రం రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఎందుకంటే అందులో చక్కర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఆపిల్ జ్యూస్ లు తాగితే చక్కర స్థాయిలు కూడా పెరుగుతాయి.

Advertisement

ద్రాక్ష: ద్రాక్షల్లో కూడా అధిక మొత్తంలో చక్కెరలు ఉంటాయి. అయితే ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. దీన్ని పరిమిత పరిమాణంలో తినాలి. పనులు కూడా నేరుగా తింటేనే మంచిది. జ్యూస్ లా తాగితే మాత్రం రక్తంలో చక్కర స్థాయిలు పెరుగుతాయి ఫలితంగా షుగర్ పెరుగుతుంది.

Diabetics  షుగర్ పేషెంట్లు ఏ జ్యూసులు తాగితే మంచిది

కాకరకాయ : కాకరకాయ రసం తాగడం వల్ల రక్తంలోని చక్కర స్థాయిలు తగ్గి మధుమేహం కంట్రోల్ అవుతుంది. దీనివల్ల, గారు కంట్రోల్ కు వస్తుంది ఇది ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం.

సొరకాయ: సొరకాయలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. దీనిలో పీచు పదార్థం ఎక్కువ. ఇది తినడం వలన చక్కర స్థాయిలు తగ్గుతాయి. ఎక్కువ కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. షుగర్ ని పెరగనివ్వదు.

కీరదోసకాయ : ఈ దోసకాయలో పుదీనా రసం కలిపితే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఈ పుదీనా మరియు దోసకాయల రసం తాగడం వల్ల చక్కెర స్థాయిలు పెరగనివ్వవు. ఫలితంగా మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది.

Advertisement

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి