Fertilizers Poisoning : కడుపుకి అన్నమే తింటున్నామా… లేదా రసాయనాన్ని పంపిస్తున్నామా…. మన ఆహారమే మన శత్రువు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Fertilizers Poisoning : కడుపుకి అన్నమే తింటున్నామా… లేదా రసాయనాన్ని పంపిస్తున్నామా…. మన ఆహారమే మన శత్రువు…?

 Authored By ramu | The Telugu News | Updated on :28 June 2025,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Fertilizers Poisoning : కడుపుకి అన్నమే తింటున్నామా... లేదా రసాయనాన్ని పంపిస్తున్నామా.... మన ఆహారమే మన శత్రువు...?

Fertilizers Poisoning : ప్రస్తుత కాలంలో వ్యాపారులు తమ అభివృద్ధి పెరగడం కొరకు ఎన్నో ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు. ఇందులో కొన్ని రసాయనాలతో నిండిపోయి ఆరోగ్యానికి హాని కలిగించేవి కలుపుతున్నారు. త్రిమంగా తయారయ్యే వీటిలో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. కొన్ని యాడ్స్ లో మనం చూస్తూనే ఉంటాం. మీ పేస్టులో ఉప్పుందా అని అడుగుతుంటారు. కానీ, మీ పేస్ లో సీసం, ఆర్సినిక్,పాదరసం, కార్మియం అనే మోస్ట్ డేంజరస్ కెమికల్స్ ఉన్నాయా అని అడగరు. పళ్ళు తల తల మెరిసిపోవడం. తరువాత అవి లోపలికి వెళ్లి, అవయవాలని పాడు చేస్తుంటాయి. ఉదయాన్నే లేవగానే అవగీతం కెమికల్ నోటిలోకి తీసుకొని, కడుపునిండా, రసాయన ఆహారం నిప్పుకొని బతికేస్తున్నాం.

Fertilizers Poisoning కడుపుకి అన్నమే తింటున్నామా లేదా రసాయనాన్ని పంపిస్తున్నామా మన ఆహారమే మన శత్రువు

Fertilizers Poisoning : కడుపుకి అన్నమే తింటున్నామా… లేదా రసాయనాన్ని పంపిస్తున్నామా…. మన ఆహారమే మన శత్రువు…?

Fertilizers Poisoning కల్తీ రసాయనాలు

పోయిన జనవరిలో మహారాష్ట్రలో జరిగిన ఓ సంఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అయితే, ఇన్ని రోజులకే ఊర్లోని వాళ్ళందరికీ బట్ట తల వచ్చేసింది. ఒక ఊరు కాదు, బుల్దానా జిల్లాలోని పలు గ్రామాలలో వారికి జుట్టు ఇప్పుడు పోయింది. వెంట్రుకల మీద చాలా మందికి కూడా ఎంతో ప్రేమ ఉంటుంది. వీళ్లంతా కూడా గగ్గోలు పెట్టేసరికి,సోదించడం మొదలుపెట్టారు. అసలు ఏం జరిగి ఉంటుంది అనుకుంటున్నారు.. తీరా తెలిసిందేమిటంటే… రేషన్ షాపుల్లో ఇచ్చిన గోధుమలు తిన్నందుకని తేలింది. లావై పోతున్నామని ఈమధ్య యువత అంతా రొట్టెలు తినడం ప్రారంభిస్తే, అది కాస్త బెడ్స్ కొట్టి బట్ట తల వచ్చేలా చేసింది.

కాని,సమస్య గోధుమల్లో లేదు,గోధుమ పంటకు వాడిన పురుగు మందుల్లో ఉంది. సెలీనియం కంటెంట్ ఎక్కువగా ఉండడంతో లక్షణాలు మొదలైన మూడు నాలుగు రోజుల్లోనే బట్టతల వచ్చేసింది. అయితే, జుట్టు ఏముందిలే ముందు ప్రాణం ఉండాలి కదా. ఇలాంటి రసాయనాలే కొన్ని రకాల పురుగుమందులే. ఏకంగా మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. సిగరెట్ గుట్కా అలవాట్లు లేకపోయినా క్యాన్సర్ ఎందుకొస్తుందంటారు… ఒకే ఒక కారణం మనం తినే ఆహారమే. ఆహార ఉత్పత్తుల కోసం ఉపయోగించే పురుగులు మందులే మనకి ఈ అనారోగ్య సమస్యలు. తినడం పక్కన పెడితే, పెస్టిసైడ్స్ చల్లుతున్న కారణంగానే ఏడాదికి 11,000 మంది రైతులు చనిపోతున్నారు. ఒక పురుగుల మందులు చల్లిన ఆహారాలని తింటే చనిపోతున్న వాళ్లు ఏటా లక్షల్లోనే ఉన్నారు. అయితే, మనం ఎవ్వరం కూడా అన్నం తినడం లేదు, అందులోని రసాయనాలని ఎక్కువగా తింటున్నాం.

దీనికి పరిష్కారం : పంట పండించే రైతులు పంటకు దిగుమతి రావాలంటే, రసాయనాల కంటే ఎక్కువ కంపోస్ట్ ఎరువులని ఉపయోగిస్తే అందర్నీ ఆరోగ్యంగా ఉంచవచ్చు. మనం ఆరోగ్యంగా ఉండవచ్చు, రైతు ఆరోగ్యంగా ఉండవచ్చు, అందర్నీ కాపాడిన వారు అవుతారు.

Tags :

    ramu

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది