air pollution increased dangerous level in hyderabad
Hyderabad : ఎయిర్ పొల్యూషన్ గురించి మాట్లాడాలంటే మనం ముందు ఢిల్లీ గురించే మాట్లాడుకోవాలి. మన దేశంలో ఢిల్లీలో ఉన్న గాలి కాలుష్యం ఇంకెక్కడ ఉండదు. ఢిల్లీ తర్వాతనే ఇంకెక్కడైనా. కానీ.. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఈ మధ్య గాలి కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. దానికి కారణం ఏంటి అనేది పక్కన పెడితే ఎయిర్ పొల్యూషన్ వల్ల హైదరాబాద్ చాలా ప్రమాదకర స్థాయికి చేరుకుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాగే ఈ ఎయిర్ పొల్యూషన్ పెరుగుతూ పోతే హైదరాబాద్ మరో ఢిల్లీ అవుతుందని అంటున్నారు. ఎయిర్ పొల్యూషన్ ను తగ్గించేందుకు అందరూ సరైన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
air pollution increased dangerous level in hyderabad
నిజానికి గాలి కాలుష్యం అనేది ఎక్కువగా చలికాలం మొదలవుతుంది. గాలిలో కాలుష్య కారకాలు పెరగడం వల్ల గాలి కాలుష్యం పెరుగుతోంది. అలాగే.. రోజు రోజుకూ వాహనాలు పెరగడం, వాటి నుంచి వచ్చే పొగ గాలిలో కమ్మేస్తుండటం వల్ల గాలిలో పొల్యూషన్ లేవల్స్ రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇటీవల డిసెంబర్ 4 న చేసిన గణాంకాలు చూస్తే.. ఎయిర్ క్వాలిటీ అత్యధికంగా సనత్ నగర్ లో ఉంది. ఇండెక్స్ ప్రకారం అక్కడ 333 పాయింట్లు నమోదు అయ్యాయి. ఇక.. అత్యల్పంగా 99 పాయింట్లు నమోదయ్యాయి.
గాలి నాణ్యత సూచీ ప్రకారం.. అత్యధికంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 183 పాయింట్లు ఉండగా, అత్యల్పంగా 88 పాయింట్లు నమోదయ్యాయి. నిజానికి ఎయిర్ ఇండెక్స్ 50 పాయింట్లు దాటకూడదు. ఎయిర్ పొల్యూషన్ పెరిగితే.. చాలామంది ఆరోగ్యం పాడవుతుంది. నిజానికి.. దేశంలోని మెట్రో నగరాలు అన్నింటిలో వాయు కాలుష్యం పెరిగినప్పటికీ.. ఢిల్లీ తర్వాత అంత ప్రమాదకరమైన స్థాయి హైదరాబాద్ లో ఉందట. ఆ తర్వాత చెన్నై కూడా అదే డేంజర్ జోన్ లో ఉందట. బెంగళూరులో హైదరాబాద్ తో పోల్చితే గాలి నాణ్యత సూచీ ప్రకారం అంతగా ప్రమాదకర స్థాయి లేదని అంటున్నారు.
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
This website uses cookies.