Congress Party : మూడుచింతలపల్లి మున్సిపల్ ఎన్నికల చివరి రోజు కాంగ్రెస్ పార్టీ జోరు ప్ర‌చారం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Congress Party : మూడుచింతలపల్లి మున్సిపల్ ఎన్నికల చివరి రోజు కాంగ్రెస్ పార్టీ జోరు ప్ర‌చారం..!

 Authored By ramu | The Telugu News | Updated on :10 February 2026,10:00 pm

ప్రధానాంశాలు:

  •  Congress Party : మూడుచింతలపల్లి మున్సిపల్ ఎన్నికల చివరి రోజు కాంగ్రెస్ పార్టీ జోరు ప్ర‌చారం..!

Congress Party  : మున్సిపల్ ఎన్నికల చివరి రోజు ప్రచారంలో భాగంగా మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జి వజ్రెష్ యాదవ్ గారు, బోడుప్పల్ మాజీ మేయర్ అజయ్ యాదవ్ గారు,మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యవసాయ కమిటీ చైర్మన్ బొమ్మల పల్లి నర్సింహులు యాదవ్ గారితో కలిసి పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆర్ వి ఫౌండేషన్ చైర్మన్ తుంగతుర్తి రవి గారు మరియు కర్రె రాజేష్ గారు పాల్గొన్నారు.

Congress Party మూడుచింతలపల్లి మున్సిపల్ ఎన్నికల చివరి రోజు కాంగ్రెస్ పార్టీ జోరు ప్ర‌చారం

Congress Party : మూడుచింతలపల్లి మున్సిపల్ ఎన్నికల చివరి రోజు కాంగ్రెస్ పార్టీ జోరు ప్ర‌చారం..!

ఈ సందర్భంగా తుంగతుర్తి రవి గారు మాట్లాడుతూ – మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో ఈసారి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రతి కుటుంబానికి చేరుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రైతులు, మహిళలు, యువత, పేద వర్గాల కోసం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజా సంక్షేమం, పారదర్శక పాలన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, మూడుచింతలపల్లి అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జైపాల్ రెడ్డి,ముత్యాలు యాదవ్, కవడపు రాంరెడ్డి,రంజిత్ కుమార్ రెడ్డి,కవిడె కుమార్, సింగం లక్ష్మణ్,మనిరాం నాయక్,సుదర్శన్ రెడ్డి,వేణుగోపాల్ రెడ్డి, సోమయ్య,మహేశ్వరప్ప, జలగం శరత్ గౌడ్,సుధాకర్ మరియు వివిధ మున్సిపల్ అధ్యక్షులు,స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది