Rajitha Parameshwar Reddy : ప్రక్రియపై కాంగ్రెస్ ఫోకస్.. నిజమైన ఓటర్లకు ఇబ్బందులు రాకూడదన్న రజిత పరమేశ్వర్ రెడ్డి..!

 Authored By ramu | The Telugu News | Updated on :21 July 2026,2:30 pm
  •  Rajitha Parameshwar Reddy Uppal ఉప్పల్‌లో SIR సహాయ కేంద్రాన్ని పరిశీలించిన మాజీ కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి.. నిజమైన ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా SIR ప్రక్రియ పూర్తి చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు కీలక సూచనలు చేశారు.

Rajitha Parameshwar Reddy : రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న SIR – Special Intensive Revision ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా పూర్తయ్యేలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని ఉప్పల్ డివిజన్ మాజీ కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హులైన ప్రతి ఓటరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా SIR ప్రక్రియ SIR Process పూర్తి చేసుకునేలా సహాయ కేంద్రాలు సమర్థవంతంగా పనిచేయాలని ఆమె సూచించారు. మంగళవారం ఉప్పల్ కచ్చిర్ స్కూల్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఈగ ఆంజనేయులు ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన SIR సహాయ కేంద్రం SIR Help Centre ను రజిత పరమేశ్వర్ రెడ్డి పరిశీలించారు. అక్కడికి వచ్చిన ఓటర్లతో మాట్లాడి వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన ఫారాలు నింపించడం, వివరాల సవరణ, నమోదు వంటి అంశాల్లో కార్యకర్తలు మరింత చురుకుగా వ్యవహరించాలని సూచించారు.

Rajitha Parameshwar Reddy :  ప్రక్రియపై కాంగ్రెస్ ఫోకస్.. నిజమైన ఓటర్లకు ఇబ్బందులు రాకూడదన్న రజిత పరమేశ్వర్ రెడ్డి..!

Rajitha Parameshwar Reddy : ప్రక్రియపై కాంగ్రెస్ ఫోకస్.. నిజమైన ఓటర్లకు ఇబ్బందులు రాకూడదన్న రజిత పరమేశ్వర్ రెడ్డి..!

Rajitha Parameshwar Reddy బీఎల్ఓలతో సమన్వయం.. ఓటర్లకు మెరుగైన సేవలు

ఈ సందర్భంగా రజిత పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, SIR ప్రక్రియలో అర్హులైన ఒక్క ఓటరు కూడా నష్టపోకుండా చూడటం ప్రతి కార్యకర్త బాధ్యత అని అన్నారు. BLO (ooth Level Officer లతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అవసరమైన సహాయం అందించాలని సూచించారు. ఓటరు జాబితాలో పేర్ల నమోదు, సవరణలు, మార్పులు, ఇతర సమస్యల పరిష్కారంలో సహాయ కేంద్రాలు కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. ఓటు హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని, అందువల్ల నిజమైన ఓటర్ల వివరాలు సక్రమంగా నమోదు కావడం అత్యంత అవసరమని ఆమె అన్నారు. ఈ ప్రక్రియలో రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు సూచించారు.

సహాయ కేంద్రాలకు వచ్చే ప్రతి వ్యక్తికి పూర్తి సమాచారం అందించడంతో పాటు అవసరమైన పత్రాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రజల్లో ఎలాంటి అపోహలు లేకుండా, పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా ఎన్నికల వ్యవస్థపై మరింత విశ్వాసం పెరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఉప్పల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఈ SIR Help Centre ద్వారా ఇప్పటికే పలువురు ఓటర్లు తమ వివరాలను సరిచేసుకోవడంతో పాటు కొత్తగా నమోదు చేసుకునేందుకు ముందుకు వస్తున్నారని స్థానిక నాయకులు తెలిపారు. ఇలాంటి సహాయ కేంద్రాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఈగ ఆంజనేయులు ముదిరాజ్, బజారు జగన్నాథ్ గౌడ్, తుమ్మల దేవి రెడ్డి, సల్లా ప్రభాకర్ రెడ్డి, మంద మురళీకృష్ణ రెడ్డి, మాశెట్టి రాఘవేందర్, భూత్కూరి మదన్ గౌడ్, కన్నమైన నరేష్, భాస్కర్ రెడ్డి, గోరిగ మహేష్, అలుగుల అనిల్, బచ్చా రాము, రాంరెడ్డి, రంగుల శేఖర్, ముదిగొండ రవి, ప్రశాంత్ రెడ్డి, మినంపల్లి కిషోర్, చంద్రశేఖర్ రెడ్డి, విజయ్, ఆసిఫ్, బట్కిరి కుమార్, తైసిన్, మోసిన్, అతిఫ్, వహీద్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సహాయ కేంద్రాలు ప్రజలకు ఎన్నికల ప్రక్రియపై అవగాహన పెంచడమే కాకుండా, నిజమైన ఓటర్లకు సకాలంలో సేవలు అందించే వేదికగా నిలుస్తాయని నాయకులు తెలిపారు.

Advertisement

ramu

Author Bio Info : Ramu ( Tandu Ramalingaiah ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి