jntu engineering student commits suicide in hyderabad
Crime News : హైదరాబాద్ లోని జేఎన్టీయూ యూనివర్సిటీలో విషాదం చోటు చేసుకుంది. జేఎన్టీయూలో ఉన్న సీఎస్ఆర్ బిల్డింగ్ పై నుంచి దూకి మేఘనా రెడ్డి అనే 21 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. తను జేఎన్టీయూలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. మేఘనారెడ్డి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడంతో జేఎన్టీయూలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.
jntu engineering student commits suicide in hyderabad
ఇతర విద్యార్థులు కూడా షాక్ లో ఉన్నారు. ఇంకొన్ని నెలల్లో ఇంజినీరింగ్ కూడా పూర్తయిపోయి.. బయటికి వెళ్లి జాబ్ చేసుకునే క్రమంలో తను ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే కోణంలో పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. అయితే.. మేఘనా రెడ్డి స్నేహితుల కథనం ప్రకారం.. తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు.
అయితే.. మేఘనారెడ్డికి మానసిక సమస్యలు ఉన్నాయట. తను గతంలోనూ ఈ మానసిక సమస్యలకు ట్రీట్ మెంట్ తీసుకుందట. అయినా కూడా తనకు ఆరోగ్యం కుదుటపడలేదని.. తీవ్రంగా ఇబ్బందులు పడేదని తన ఫ్రెండ్స్ చెబుతున్నారు. ఈనేపథ్యంలోనే.. తన అనారోగ్య సమస్యలకు భయపడి మేఘనారెడ్డి ఆత్మహత్య చేసుకుందా? లేక తను ఆత్మహత్య చేసుకోవడానికి మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏది ఏమైనా మేఘనారెడ్డి ఆత్మహత్యతో జేఎన్టీయూ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జేఎన్టీయూ అధికారులు తగిన చర్యలు చేపడుతున్నారు. విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. అందరినీ మోటివేట్ చేస్తున్నారు.
Palm Candy Benefits | ప్రాచీన కాలం నుంచీ మన వంటగదిలో ఒక ముఖ్యమైన స్థానం పొందిన తాటి బెల్లం,…
Brinjal | వంకాయను సాధారణంగా మనం కూరగాయగా చూస్తాం. కానీ, ఈ సాధారణంగా కనిపించే కూరగాయకు ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు…
Vastu Tips | ఇంటి నిర్మాణం మరియు చుట్టూ ఉన్న వాతావరణం వ్యక్తి జీవనశైలిపై, ఆరోగ్యంపై, ఆర్థిక స్థితిపై ప్రభావం…
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
This website uses cookies.