Uppal Bhagayath : ఉప్పల్ బాగాయత్‌కు భారీ వరాలు.. రూ.100 కోట్లతో MMC భవనం, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు గ్రీన్ సిగ్నల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Uppal Bhagayath : ఉప్పల్ బాగాయత్‌కు భారీ వరాలు.. రూ.100 కోట్లతో MMC భవనం, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు గ్రీన్ సిగ్నల్

 Authored By ramu | The Telugu News | Updated on :27 May 2026,11:23 am

ప్రధానాంశాలు:

  •  Uppal Bhagayath : ఉప్పల్ బాగాయత్‌కు భారీ వరాలు.. రూ.100 కోట్లతో MMC భవనం, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు గ్రీన్ సిగ్నల్

Uppal Bhagayath : ఉప్పల్ బాగాయత్ ప్రాంత అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC) కార్యాలయ భవన నిర్మాణం నుంచి స్పోర్ట్స్ కాంప్లెక్స్, కమ్యూనిటీ హాల్ వరకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి బుధవారం ఉప్పల్ బాగాయత్ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా స్థానిక కాలనీ వాసులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించిన పరమేశ్వర్ రెడ్డి, త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా MMC కార్పొరేషన్ భవన నిర్మాణానికి భూమి పూజ జరగనుందని వెల్లడించారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం 10 ఎకరాల భూమితో పాటు రూ.100 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ఈ భవనం నిర్మాణంతో ప్రాంతీయ ప్రజలకు మున్సిపల్ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

Uppal Bhagayath ఉప్పల్ బాగాయత్‌కు భారీ వరాలు రూ100 కోట్లతో MMC భవనం స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు గ్రీన్ సిగ్నల్

Uppal Bhagayath : ఉప్పల్ బాగాయత్‌కు భారీ వరాలు.. రూ.100 కోట్లతో MMC భవనం, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు గ్రీన్ సిగ్నల్

Uppal Bhagayath  MMC భవనం, ప్రహారీ గోడల నిర్మాణానికి శ్రీకారం

ఉప్పల్ బాగాయత్‌లో ఖాళీ స్థలాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. రూ.3.10 కోట్ల వ్యయంతో ప్రహారీ గోడల నిర్మాణం చేపడుతున్నామని, ప్రస్తుతం ఆ పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ప్రహారీ గోడల నిర్మాణ పనులను, కొత్తగా ఏర్పాటు చేస్తున్న బోర్‌వెల్ పనులను స్వయంగా పరిశీలించారు.ప్రాంతంలో ప్రభుత్వ భూముల పరిరక్షణతో పాటు భవిష్యత్తు అభివృద్ధి కార్యక్రమాలకు అనుకూల వాతావరణం కల్పించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కాలనీలో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పార్కులు వంటి అంశాలపై కూడా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.

Uppal Bhagayath స్పోర్ట్స్ కాంప్లెక్స్, కమ్యూనిటీ హాల్‌తో అభివృద్ధి

ఉప్పల్ బాగాయత్ యువత కోసం త్వరలోనే రూ.10 కోట్లతో ఆధునిక మల్టీలెవల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించనున్నట్లు పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో వివిధ క్రీడలకు సంబంధించిన సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. యువతకు క్రీడల్లో ప్రోత్సాహం అందించడంతో పాటు ఆరోగ్యకర జీవనశైలిని పెంపొందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.అలాగే సామాజిక కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించేందుకు రూ.3.5 కోట్లతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. కాలనీ ప్రజలకు అవసరమైన అన్ని రకాల అభివృద్ధి పనులు దశలవారీగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.“ఉప్పల్ బాగాయత్ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని ఆదర్శవంతమైన కాలనీగా తీర్చిదిద్దుతాం” అని పరమేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీ వాసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రాంత అభివృద్ధిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేశారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది