Parameshwar Reddy : ఉప్పల్లో నాలా బాధితులకు అండగా ఉంటా.. మందుముల పరమేశ్వర్ రెడ్డి
ప్రధానాంశాలు:
Parameshwar Reddy : ఉప్పల్లో నాలా బాధితులకు అండగా ఉంటా.. మందుముల పరమేశ్వర్ రెడ్డి
Parameshwar Reddy : ఉప్పల్ Uppal ప్రాంతంలోని నాలా అభివృద్ధి పనుల నేపథ్యంలో పలువురు కాలనీవాసులు ఆందోళనకు గురవుతున్న వేళ, ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ mandumula parameshwar reddy శ్రీ మందుముల పరమేశ్వర్ రెడ్డి బాధితుల పక్షాన నిలిచి వారికి అండగా నిలిచారు. అభివృద్ధి పనులు ప్రజలకు మేలు చేయాలే గానీ, వారి జీవనోపాధి లేదా నివాసాలకు నష్టం కలిగించకూడదనే ఉద్దేశంతో ఆయన ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపారు. Uppal ఉప్పల్లోని కావేరి నగర్ నుంచి నల్ల చెరువు వరకు ఉన్న నాలాకు ఇరువైపులా రిటర్నింగ్ వాల్ నిర్మించేందుకు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్లాన్ (SNDP) కింద సుమారు రూ.18 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ ప్రాజెక్ట్లో భాగంగా నాచారం పెద్ద చెరువు నుంచి ఉప్పల్ నల్ల చెరువు వరకు స్టార్మ్ వాటర్ డ్రెయిన్ (SWD) నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు అధికారులు ప్రకటించారు.ఈ నేపథ్యంలో నాలా పరిసర ప్రాంతాల్లో ఉన్న కావేరి నగర్, న్యూ భారత్ నగర్, హనుమాన్ నగర్, నార్త్ స్వరూప్ నగర్, సౌత్ స్వరూప్ నగర్ తదితర కాలనీలకు చెందిన నివాసితులకు మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
Parameshwar Reddy : ఉప్పల్లో నాలా బాధితులకు అండగా ఉంటా.. మందుముల పరమేశ్వర్ రెడ్డి
Parameshwar Reddy నాలా అభివృద్ధి పనులతో ఆందోళనలో కాలనీవాసులు
ప్రాజెక్ట్ కారణంగా కొన్ని ఆస్తులు ప్రభావితమయ్యే అవకాశం ఉందని నోటీసుల్లో పేర్కొనడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.ఏళ్ల తరబడి అదే ప్రాంతంలో నివసిస్తూ వస్తున్న కుటుంబాలు తమ ఇళ్ల భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. తమ నివాసాలు కోల్పోయే ప్రమాదం ఉందని భావించిన స్థానికులు పరమేశ్వర్ రెడ్డిని కలిసి తమ సమస్యను వివరించారు. “మా ఇళ్లు పోతే మేము రోడ్డున పడతాం. మమ్మల్ని కాపాడండి” అంటూ బాధితులు ఆయనను వేడుకున్నారు.
Parameshwar Reddy బాధితులతో కలిసి కమిషనర్ను కలిసిన పరమేశ్వర్ రెడ్డి
స్థానికుల ఆవేదనను తెలుసుకున్న వెంటనే పరమేశ్వర్ రెడ్డి స్పందించారు. సమస్యను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, బాధితులను వెంట తీసుకుని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ వినయ్ కృష్ణారెడ్డిని కలిసి ప్రత్యేకంగా చర్చించారు.ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, నాలా అభివృద్ధి పనులు అవసరమే అయినప్పటికీ ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని అధికారులను కోరారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలు తమ జీవితకాల పొదుపులతో నిర్మించుకున్న ఇళ్లను కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.అభివృద్ధి పనుల కారణంగా ఒక్క ఆస్తి కూడా కోల్పోకుండా చూడాలని, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలను అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు. ప్రజల ఇబ్బందులను తగ్గించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
దీనిపై స్పందించిన కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, ప్రాజెక్ట్ అమలులో ప్రజలకు నష్టం కలగకుండా చూసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. “ఏ ఒక్కరికీ నష్టం జరగకుండా, సాధ్యమైనంత వరకు ఎలాంటి ఆస్తి ప్రభావితంకాకుండా ప్రణాళికలు రూపొందిస్తాం” అని ఆయన పేర్కొన్నారు.కమిషనర్ హామీతో స్థానికులు కొంత ఊరట పొందారు. ఈ సమావేశంలో ఉప్పల్, కావేరి నగర్, న్యూ భారత్ నగర్, నార్త్ స్వరూప్ నగర్, సౌత్ స్వరూప్ నగర్ ప్రాంతాలకు చెందిన పెద్ద సంఖ్యలో కాలనీవాసులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, “ప్రజల సమస్యలను పరిష్కరించడం ప్రజాప్రతినిధుల బాధ్యత. అభివృద్ధి పేరుతో ప్రజల ఇళ్లు కోల్పోయే పరిస్థితి రాకూడదు. ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా, వారి హక్కులు కాపాడేలా నేను నిరంతరం పోరాడుతాను” అని భరోసా ఇచ్చారు.స్థానికుల సమస్యలపై స్పందిస్తూ, అధికారులతో సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్న పరమేశ్వర్ రెడ్డి చొరవను కాలనీవాసులు అభినందిస్తున్నారు.