దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని తుంగతుర్తి శాసన సభ్యుడు గాదరి కిషోర్ కుమార్ అన్నారు. మంగళవారం జాజిరెడ్డిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో వివిధ గ్రామాల లబ్ధిదారులకు ఎమ్మెల్యే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాదరి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం టీఆర్ఎస్ సర్కారు పని చేస్తున్నదని చెప్పారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తమ ప్రభుత్వం పేదల పక్షమని తెలిపారు. రైతుల కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. రైతు బంధు, రైతు బీమా రైతాంగం శ్రేయస్సు కోసమే తెచ్చినట్లు వివరించారు. ఇకపోతే పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం ఓ వరం లాంటిదని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా అందే డబ్బులు ఆడబిడ్డల తల్లిదండ్రులకు సాయంగా ఉపయోగపడతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అంజయ్య, జెడ్పీటీసీ, జ్యోతి, ఎంపీడీవో అధికారులు, స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
This website uses cookies.